జనవరి 24నుంచి ఫ్లైట్స్ లో 35 మందికే అనుమతి..కువైట్ ఉత్తర్వులు
- January 23, 2021కువైట్ సిటీ:కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా విమాన ప్రయాణాలకు సంబంధించి మార్గదర్శకాల్లో సవరణలు చేసింది కువైట్ ప్రభుత్వం. ఇక నుంచి కువైట్ కు వచ్చే విమానాల్లో 35 మంది ప్రయాణికులకు మించి ఉండొద్దని నిర్ణయించింది. ఈ మేరకు కువైట్ నుంచి ఆపరేట్ చేసే అన్ని విమానయాన సంస్థలకు డీజీసీఏ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే..కువైట్ నుంచి ఇతర దేశాలకు వెళ్లే విమానాలకు మాత్రం ఈ నిబంధన వర్తించదు. సంఖ్యతో పరిమితి లేకుండా ఇప్పటివరకు ఉన్న నిబంధనల మేరకు ప్రయాణికులను తీసుకెళ్ల వచ్చు. కోవిడ్ వ్యాప్తి నివారణకు ఆరోగ్య శాఖ జారీ చేసిన చేసిన ఆదేశాలకు అనుగుణంగా ప్రయాణికుల కుదింపు ఉత్తర్వులను జారీ చేసినట్లు డీజీసీఏ వెల్లడించింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు