దుబాయ్ రెస్టారెంట్లు, కేఫ్ లలో సోషల్ డిస్టెన్సింగ్ అమలుకు కొత్త రూల్స్
- January 23, 2021దుబాయ్:రెస్టారెంట్లు, కేఫ్ లలో అమలు చేస్తున్న భౌతిక దూరం నిబంధనలను స్వల్పంగా సవరించింది దుబాయ్ సుప్రీం కమిటీ. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు అవసరమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఏర్పాటైన సుప్రీం కమిటీ..ఇకపై రెస్టారెంట్లు, కేఫ్ లలో మరింత దూరం పెంచాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు రెండు టేబుళ్ల మధ్య రెండు మీటర్లు ఉంటే సరిపోయేది. సుప్రీం కమిటీ తీసుకున్న లేటెస్ట్ నిర్ణయం ప్రకారం ఇక నుంచి టేబుల్ కి టేబుల్ కి మధ్య మూడు మీటర్ల దూరాన్ని మేయిన్టేన్ చేయాలి. అలాగే ఒక్కో టేబుల్ మీద గరిష్టంగా అనుమతించే వినియోగదారుల సంఖ్యను కూడా కుదించారు. రెస్టారెంట్లలో అయితే ఒక్కో టేబుల్ పై గతంలో పది మందికి అనుమతి ఉండేది. కానీ, ఇప్పుడు ఏడుగురికి మించి అనుమతించరాదు. ఇక కేఫ్ లలో ఒక్కో టేబుల్ పై గరిష్టంగా నలుగురిని మాత్రమే అనుమతిస్తారు. రెస్టారెంట్లు, కేఫ్ లలో వినియోగదారుల సంఖ్యను కుదించటం...తద్వారా భౌతిక దూరం నిబంధనను పకడ్బందీగా అమలు చేసేందుకు అనువుగా నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- 24 గంటల్లో సాధారణ స్థితికి దుబాయ్ ఎయిర్ పోర్ట్
- బహ్రెయిన్ లో భారీ వర్షాలు, వరదలు
- ఒమన్ లో 21కి చేరిన మృతుల సంఖ్య
- ట్రావెల్, టూరిజం రంగంలో 23,500 ఖాళీలు
- జెడ్డాలో శతాబ్దాల నాటి రక్షణ కందకం, కోట గోడ వెలికితీత
- హైదరాబాద్లోని ఫిలింనగర్లో తీవ్ర విషాదం..
- కార్ల దగ్గర ఆయిల్ స్లిక్.. నివాసితుల ఆందోళన
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా