జనవరి 24నుంచి ఫ్లైట్స్ లో 35 మందికే అనుమతి..కువైట్ ఉత్తర్వులు

- January 23, 2021 , by Maagulf
జనవరి 24నుంచి ఫ్లైట్స్ లో 35 మందికే అనుమతి..కువైట్ ఉత్తర్వులు

కువైట్ సిటీ:కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా విమాన ప్రయాణాలకు సంబంధించి మార్గదర్శకాల్లో సవరణలు చేసింది కువైట్ ప్రభుత్వం. ఇక నుంచి కువైట్ కు వచ్చే విమానాల్లో 35 మంది ప్రయాణికులకు మించి ఉండొద్దని నిర్ణయించింది. ఈ మేరకు కువైట్ నుంచి ఆపరేట్ చేసే అన్ని విమానయాన సంస్థలకు డీజీసీఏ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే..కువైట్ నుంచి ఇతర దేశాలకు వెళ్లే విమానాలకు మాత్రం ఈ నిబంధన వర్తించదు. సంఖ్యతో పరిమితి లేకుండా ఇప్పటివరకు ఉన్న నిబంధనల మేరకు ప్రయాణికులను తీసుకెళ్ల వచ్చు. కోవిడ్ వ్యాప్తి నివారణకు ఆరోగ్య శాఖ జారీ చేసిన చేసిన ఆదేశాలకు అనుగుణంగా ప్రయాణికుల కుదింపు ఉత్తర్వులను జారీ చేసినట్లు డీజీసీఏ వెల్లడించింది. 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com