జనవరి 24నుంచి ఫ్లైట్స్ లో 35 మందికే అనుమతి..కువైట్ ఉత్తర్వులు
- January 23, 2021కువైట్ సిటీ:కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా విమాన ప్రయాణాలకు సంబంధించి మార్గదర్శకాల్లో సవరణలు చేసింది కువైట్ ప్రభుత్వం. ఇక నుంచి కువైట్ కు వచ్చే విమానాల్లో 35 మంది ప్రయాణికులకు మించి ఉండొద్దని నిర్ణయించింది. ఈ మేరకు కువైట్ నుంచి ఆపరేట్ చేసే అన్ని విమానయాన సంస్థలకు డీజీసీఏ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే..కువైట్ నుంచి ఇతర దేశాలకు వెళ్లే విమానాలకు మాత్రం ఈ నిబంధన వర్తించదు. సంఖ్యతో పరిమితి లేకుండా ఇప్పటివరకు ఉన్న నిబంధనల మేరకు ప్రయాణికులను తీసుకెళ్ల వచ్చు. కోవిడ్ వ్యాప్తి నివారణకు ఆరోగ్య శాఖ జారీ చేసిన చేసిన ఆదేశాలకు అనుగుణంగా ప్రయాణికుల కుదింపు ఉత్తర్వులను జారీ చేసినట్లు డీజీసీఏ వెల్లడించింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు