డ్రగ్స్ స్మగ్లింగ్ గుట్టు రట్టు
- January 23, 2021రియాద్:సౌదీ బలగాలు, డ్రగ్స్ స్మగ్లింగ్ గుట్టుని రట్టు చేశారు. ఈ క్రమంలో 20 మిలియన్ యాంఫిటమిన్ ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. గ్రేప్ ఫ్రూట్ షిప్మెంట్లో ఈ డ్రగ్స్ని కనుగొన్నట్లు అధికారులు వివరించారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ అధికార ప్రతినిథి కెప్టెన్ మొహమ్మద్ బిన్ ఖాలెద్ అల్ నాజిది మాట్లాడుతూ జెడ్డా ఇస్లామిక్ పోర్టు నుంచి స్మగ్లింగ్ యత్నం జరుగుతుండగా, అడ్డుకుని 20,190,500 పిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. జనరల్ కస్టమ్స్ అథారిటీతో కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఘటనలో మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు సౌదీలు, ఆరుగురు రెసిడెంట్స్ వున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?