మరిన్ని హెల్త్ సెంటర్లను పూర్తి చేయనున్న అష్గల్
- January 23, 2021దోహా:పబ్లిక్ వర్క్స్ అథారిటీ, ఈ ఏడాది మరిన్ని హెల్త్ సెంటర్లను పూర్తి చేయనుంది. అయిన్ ఖాలిద్, అల్ సాద్ మరియు అల్ ఖోర్లలోని హెల్త్ సెంటర్లను పూర్తి చేయనున్నట్లు అష్గల్ ప్రకటించింది. ఈ కొత్త హెల్త్ సెంటర్లలో జనరల్ మరియు స్పెషల్ క్లినిక్లు, డెంటిస్ట్రీ, ఫిజియోథెరపీ మరియు ఫ్యామిలీ విభాగాలుంటాయి. ఈ మూడు సెంటర్లు 2021 తొలి క్వార్టర్లో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అష్గల్ పేర్కొంది. కాగా, సౌత్ అల్ వక్రకా హెల్త్ సెంటర్, 3,000 చదరపు మీటర్ల వైశాల్యంలో విస్తరించనుంది. తొమ్మిది క్లినిక్లతో ఇది రూపు దిద్దుకుంటోంది. 125 కార్లకు పార్కింగ్, అంబులెన్సుల గ్యారేజీని ఏర్పాటు చేశారు. అల్ సాద్ హెల్త్ సెంటర్ 29,022 చదరపు మీటర్లలో 100 క్లనిక్స్తో ఏర్పాటవుతోంది. అల్ ఖోర్ సెంటర్ని 24,998 చదరపు మీటర్ల వైశాల్యంలో ఏర్పాటు చేస్తున్నారు. 60 క్లినిక్లు రోజుకి 650 మంది విజిటర్స్ కోసం వీలుగా ఏర్పాటు చేయబడుతున్నాయి.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన