మరిన్ని హెల్త్ సెంటర్లను పూర్తి చేయనున్న అష్గల్
- January 23, 2021దోహా:పబ్లిక్ వర్క్స్ అథారిటీ, ఈ ఏడాది మరిన్ని హెల్త్ సెంటర్లను పూర్తి చేయనుంది. అయిన్ ఖాలిద్, అల్ సాద్ మరియు అల్ ఖోర్లలోని హెల్త్ సెంటర్లను పూర్తి చేయనున్నట్లు అష్గల్ ప్రకటించింది. ఈ కొత్త హెల్త్ సెంటర్లలో జనరల్ మరియు స్పెషల్ క్లినిక్లు, డెంటిస్ట్రీ, ఫిజియోథెరపీ మరియు ఫ్యామిలీ విభాగాలుంటాయి. ఈ మూడు సెంటర్లు 2021 తొలి క్వార్టర్లో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అష్గల్ పేర్కొంది. కాగా, సౌత్ అల్ వక్రకా హెల్త్ సెంటర్, 3,000 చదరపు మీటర్ల వైశాల్యంలో విస్తరించనుంది. తొమ్మిది క్లినిక్లతో ఇది రూపు దిద్దుకుంటోంది. 125 కార్లకు పార్కింగ్, అంబులెన్సుల గ్యారేజీని ఏర్పాటు చేశారు. అల్ సాద్ హెల్త్ సెంటర్ 29,022 చదరపు మీటర్లలో 100 క్లనిక్స్తో ఏర్పాటవుతోంది. అల్ ఖోర్ సెంటర్ని 24,998 చదరపు మీటర్ల వైశాల్యంలో ఏర్పాటు చేస్తున్నారు. 60 క్లినిక్లు రోజుకి 650 మంది విజిటర్స్ కోసం వీలుగా ఏర్పాటు చేయబడుతున్నాయి.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక