ఫిల్మ్ నగర్ సన్నిధానంలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్..

- February 24, 2016 , by Maagulf
ఫిల్మ్ నగర్  సన్నిధానంలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్..

జూబ్లీహిల్స్ ఏరియాలోని ఫిల్మ్ నగర్ సన్నిధానంలో బుధవారం ఉదయం పలువురు సినీతారలు, పలువురు రాజీకీయ ప్రముఖులు సందడి చేసారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో ప్రారంభమైన అంకురార్పణ కార్యక్రమానికి సినీరంగానికి చెందిన ప్రముఖులతో పాటు పలువురు రాజకీయనాకులు హాజరయ్యారు.
స్వరూపానంద స్వామిజీ చేతుల మీదుగా సంతోషిమాత, లక్ష్మీనారసింహ స్వామి, సూర్యనారాయణస్వామి వార్ల విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా వచ్చి ఈ అంకురార్పణ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. చిరంజీవితో పాటు వెంటేష్, నాగార్జున, మురళీ మోహన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా పూర్ణాహుతి నిర్వహించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com