రాజస్థాన్‌లో స్వల్ప భూకంపం సంభవించింది

- February 24, 2016 , by Maagulf
రాజస్థాన్‌లో స్వల్ప భూకంపం సంభవించింది

రాజస్థాన్‌లో బుధవారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. జాలోర్‌ జిల్లాలో ఉదయం 7.36 గంటల సమయంలో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 3.0గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే దీని వల్ల ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని, ఆస్తి నష్టం వాటిల్లలేదని తెలిపారు. ఒక్కసారిగా భూమి కంపించడం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com