కోవిడ్ స్ట్రెయిన్ విస్తరించకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రధాని హెచ్చరిక
- January 28, 2021కువైట్ సిటీ:కోవిడ్ స్ట్రెయిన్ కింగ్డమ్ లో విస్తరించకుండా..ఎక్కడికక్కడ కట్టడి చేయాల్సిన అవసరం ఉందని కువైట్ ప్రధాని షేక్ సబా ఖలేద్ అల్ అహ్మద్ అల్ సబా అన్నారు. వైరస్ వ్యాప్తి నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించిన ఆయన..వైరస్ వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోవిడ్ 19 కారణంగా పారిశ్రామిక రంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటోందని...ఇప్పటికీ ఆ సంక్షోభం కొనసాగుతోంది..ఎప్పటికీ బయట పడతామో కూడా ఖచ్చితంగా చెప్పలేమని అభిప్రయాపడ్డారు. దేశీయంగా దాదాపు 30 వేల పరిశ్రమలు కోవిడ్ సంక్షోభంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయని, ప్రపంచవ్యాప్తంగా 225 మిలియన్ల మంది ఉద్యోగాలు కొల్పొవాల్సి వచ్చిందని అన్నారు. కింగ్డమ్ పరిధిలో రెండు బ్రిటన్ స్ట్రెయిన్ కేసులు గుర్తించిన తర్వాత విమానాశ్రయాల్లో ముందు జాగ్రత్త చర్యలను మరింత ముమ్మరం చేశామన్నారు. కింగ్డమ్ పరిధిలో వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇవ్వటం ద్వారా సంక్షోభం నుంచి బయటపడతామని విశ్వసిస్తున్నట్లు ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం