అమెరికాలో మహాత్మ గాంధీ విగ్రహం ధ్వంసం
- January 30, 2021_1612002276.jpg)
అమెరికా:జాతిపిత మహాత్మ గాంధీ వర్ధంతి రోజున మహాత్ముడికి అమెరికాలో ఘోర అవమానం జరిగింది. అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో గల మహాత్మా గాంధీ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. దావిస్ నగరంలోని సెంట్రల్ పార్కులో ఉన్న 6 అడుగుల మహాత్ముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. 294 కేజీల బరువు, ఆరు అడుగుల ఎత్తున్న కాంస్య విగ్రహాన్ని ధ్వంసం చేయడమే కాకుండా బేస్ మెంట్ నుంచి తొలగించివేశారు. అయితే ఆ విగ్రహాన్ని అక్కడినుంచి తొలిగించి... దీన్ని మళ్ళీ బాగు చేస్తామని డేవిస్ సిటీ కౌన్సిలర్ ల్యుకాస్ ఫ్రెరిచ్ తెలిపారు. కాగా దీనిపై భారత అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిపై వెంటనే దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. అటు నాలుగేళ్ల కిందట ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని భారత్ అమెరికాకు బహుమతిగా పంపింది.
తాజా వార్తలు
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!