గల్ఫ్ కార్మికుడి అంతిమయాత్రలో వినూత్న ప్రదర్శన
- January 30, 2021
తెలంగాణ:విదేశాలలో అసువులుబాసిన ప్రవాసీ కార్మికుల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల మృతధన సహాయం చెల్లించాలని కోరుతూ గ్రామ ప్రజలు, గల్ఫ్ వాపసీలు 'గల్ఫ్ జెఏసి' ఆధ్వర్యంలో ఇద్దరు గల్ఫ్ కార్మికుల అంతిమయాత్రలో వేరువేరుగా ప్లకార్డుల ప్రదర్శన నిర్వహించిన సంఘటన జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం రాగోజీపేట, పసునూరు గ్రామాలలో శనివారం జరిగింది.

మేడిపల్లి మండలంలోని రాగోజిపేటకు చెందిన ఇల్లెందుల లక్ష్మణ్ సౌదీ అరేబియాలో మృతిచెందగా, పసునూరుకు చెందిన గసిగంటి నారాయణ యుఎఇ దేశంలోని షార్జాలో మృతిచెందారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై విభాగం వారు హైదరాబాద్ ఏర్ పోర్ట్ నుండి ఒకే అంబులెన్సులో రెండు శవపేటికలను ఆయా గ్రామాల వరకు ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పించారు.
గల్ఫ్ జెఏసి కన్వీనర్ గుగ్గిళ్ల రవిగౌడ్ నాయకత్వంలో గల్ఫ్ ప్రవాసీ కార్మికుల అంతిమయాత్రలో ప్లకార్డులు ప్రదర్శన నిర్వహించారు. గల్ఫ్ ప్రవాసీ కార్మికుల సంక్షేమానికి బడ్జెట్ లో రూ. 500 కోట్లు కేటాయించాలని, గల్ఫ్ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 5 లక్షల మృతధన సహాయం ఇవ్వాలని వారు ఈ సందర్బంగా ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..







