గల్ఫ్ కార్మికుడి అంతిమయాత్రలో వినూత్న ప్రదర్శన
- January 30, 2021
తెలంగాణ:విదేశాలలో అసువులుబాసిన ప్రవాసీ కార్మికుల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల మృతధన సహాయం చెల్లించాలని కోరుతూ గ్రామ ప్రజలు, గల్ఫ్ వాపసీలు 'గల్ఫ్ జెఏసి' ఆధ్వర్యంలో ఇద్దరు గల్ఫ్ కార్మికుల అంతిమయాత్రలో వేరువేరుగా ప్లకార్డుల ప్రదర్శన నిర్వహించిన సంఘటన జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం రాగోజీపేట, పసునూరు గ్రామాలలో శనివారం జరిగింది.

మేడిపల్లి మండలంలోని రాగోజిపేటకు చెందిన ఇల్లెందుల లక్ష్మణ్ సౌదీ అరేబియాలో మృతిచెందగా, పసునూరుకు చెందిన గసిగంటి నారాయణ యుఎఇ దేశంలోని షార్జాలో మృతిచెందారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై విభాగం వారు హైదరాబాద్ ఏర్ పోర్ట్ నుండి ఒకే అంబులెన్సులో రెండు శవపేటికలను ఆయా గ్రామాల వరకు ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పించారు.
గల్ఫ్ జెఏసి కన్వీనర్ గుగ్గిళ్ల రవిగౌడ్ నాయకత్వంలో గల్ఫ్ ప్రవాసీ కార్మికుల అంతిమయాత్రలో ప్లకార్డులు ప్రదర్శన నిర్వహించారు. గల్ఫ్ ప్రవాసీ కార్మికుల సంక్షేమానికి బడ్జెట్ లో రూ. 500 కోట్లు కేటాయించాలని, గల్ఫ్ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 5 లక్షల మృతధన సహాయం ఇవ్వాలని వారు ఈ సందర్బంగా ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







