ప్రభాస్ 'ప్రతాప రుద్రుడు'గా..
- February 24, 2016
బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ రేంజ్ భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా మార్కెట్ పరంగా ప్రభాస్ ఇప్పుడు టాలీవుడ్ లోనే టాప్ హీరోగా ఎదిగాడు. అందుకే పెద్ద బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించే సినిమాలకు ప్రభాస్ నే హీరోగా సెలెక్ట్ చేసుకుంటున్నారు దర్శకనిర్మాతలు. అదే బాటలో తన నెక్ట్స్ సినిమా కోసం ప్రభాస్ ను సంప్రదిస్తున్నాడు దర్శకుడు గుణశేఖర్.రుద్రమదేవి సినిమాతో మంచి విజయం సాధించిన గుణశేఖర్, ఆ చిత్రానికి సీక్వల్ గా చివరి కాకతీయ రాజు ప్రతాపరుద్రుడి జీవిత చరిత్రను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. రుద్రమదేవి సినిమాతో రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించటంతో సీక్వెల్ ను మరింత భారీగా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు.అందుకు తగ్గట్టుగానే భారీ క్రేజ్ ఉన్న స్టార్ అయితే సినిమాకు ప్లస్ అవుతుందని భావించి ప్రభాస్ ను సంప్రదిస్తున్నాడట.ప్రస్తుతం బాహుబలి 2 షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ ఏడాది చివరకు ఫ్రీ అవుతాడు. ఈ సినిమా తరువాత మిర్చి నిర్మాతలతో సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమాను అంగీకరించాడు. ఈ రెండు సినిమాలు పూర్తయితే గాని ప్రభాస్ డేట్స్ దొరికే పరిస్థితి లేదు. మరి గుణశేఖర్ ప్రభాస్ ను ప్రతాపరుద్రుడి పాత్రకు ఒప్పిస్తాడా..? లేక మరో హీరోతో మొదలెట్టేస్తాడా చూడాలి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







