తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- February 02, 2021
తెలంగాణలో కరోనా మహమ్మారి ఉదృతి తగ్గుముఖం పట్టింది. రోజువారీ కేసుల సంఖ్యతో పాటుగా మరణాల సంఖ్య కూడా తగ్గుతోంది. దీంతో ప్రజలు బయటకు వచ్చి రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక లాక్ డౌన్ కరోనా మార్గదర్శకాల్లో కూడా నిబంధనలు సడలించిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం శుభపరిణామం. ఇక ఇదిలా ఉంటె, ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం కొత్తగా రాష్ట్రంలో 152 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,94,739కి చేరింది. ఇందులో 2,91,115 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2022 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక కరోనాతో రాష్ట్రంలో కొత్తగా ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం నమోదైన కరోనా మరణాల సంఖ్య 1602కి చేరింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







