ఒళ్ళు గగుర్పొడిచే ఆనవాయితీ..సమాధి నుంచి మృత దేహాన్నివెలికి తీసి...
- February 02, 2021
ప్రపంచంలో అనేక ప్రాంతాలు.. ఈ ప్రాంతాల్లోని ప్రజల్లో జన్మలపై.. మరణాల పై రకరకాల విశ్వాసాలు.. తమ తమ మత విశ్వాసాలు, ఆచారాలు, పద్దతులను ప్రతి ఒక్కరూ ఎంతో శ్రద్దాసక్తులతో పాటిస్తారు. ఇక మనిషి మరణం పై ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విశ్వాసం.. ఈ కోవలోకే వచ్చేవి.. ఈజిప్టు పిరమిడ్లు. భారత్, చైనా, కొరియా, అమెరికా ఇలా ఏదేశమైన వారి వారి సంప్రదాయాలను అనుసరించి మరణించినవారిని గౌరవిస్తారు. ఇక మనదేశంలో అయితే మనిషి మరణం తర్వాత.. కర్మకాండలు నిర్వహించడం.. ఏడాదికి ఒకసారి.. సంవత్సరీకం అంటూ మరణించిన వారిని గుర్తుకు చేసుకోవడం చేస్తుంటాం. కానీ కొన్ని ప్రాంతాల్లోని కొన్ని తెగల్లో ఆచారాలు భీతిగొలిపేవిగా, అసలు ఇటువంటి ఆచారాలు ఉంటాయా ..? అనిపించేవిగా ఉంటాయి. ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఇండోనేషియాలోని ఓ గ్రామంలో సంవత్సరీకాలు షాక్ కలిగించేవిగా ఉంటాయి.
ఇండోనేషియాలోని రిందిగాల్లో గ్రామ ప్రజలు నమ్మకాలు, విశ్వాసాలు ఆశ్చర్యం కలిగించేవిగా ఉంటాయి.. మరణించిన వ్యక్తి పై ఆ గ్రామ ప్రజలు చూపే ప్రేమ, గౌరవం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మరణించిన వ్యక్తిని ఏడాదికి ఒకసారి సంవత్సరీకం పేరుతో గుర్తు చేసుకోవడం.. సహజం.. వారిపేరుతో అన్నదానం, వస్త్ర దానం వంటివి నిర్వహిస్తాం.. కానీ రిందిగాల్లో గ్రామ ప్రజలు మాత్రం మరణించిన వారి పార్ధివ దేహాన్ని ఏడాదికి ఒకసారి సమాధి నుంచి వెలికితీస్తారు. అనంతరం వాటిని రసాయనాలతో శుభ్రపరుస్తారు. వారు బతికి ఉన్నప్పుడు ఎలా జీవించారో అదే విధంగా శవాలను రెడీ చేస్తారు. వారికి నచ్చిన రంగుల దుస్తులను ధరింప జేసి, సిగరెట్లు, కళ్ళజోడు, తినే ఆహార పదార్ధాలను ఏర్పాటు చేస్తారు.. తర్వాత శవాలను ఇంటికి తీసుకొని వచ్చి.. బతికి ఉన్న సమయంలో ఏ ప్లేస్ లో ఇష్టంగా కూర్చుండే వారో ఆ స్థలంలో కూర్చోబెడతారు. మధ్యాహ్నం కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేస్తారు. రోజంతా వారు పండగలా సంబరాలు చేసుకొంటారు.. సాయంత్రం అయ్యేసరికి గ్రామస్తుల మొహాల్లో విషాదఛాయలు కనిపిస్తాయి. చీకటి పడిన తర్వాత గ్రామస్తులంతా శవాలను తిరిగి భధ్రంగా స్మశానానికి చేరుస్తారు.. యధావిధిగా సమాధిని మూసేస్తారు.. రాత్రంతా వారు జాగరణ చేస్తూ మరణించినవారిని తలుచుకుంటూ గడుపుతారు.. ఇదండీ.. ఇక్కడ మనిషి మరణించిన తర్వాత సంవత్సరీకాలు జరిపే విధానం..!
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







