భారత్ లో కరోనా కేసుల వివరాలు

- February 03, 2021 , by Maagulf
భారత్ లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా అదుపులోకి వచ్చిందనే చెప్పొచ్చు.గతంలో వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండేవి.కానీ, ఇప్పుడు ఆ సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది.భారత ప్రభుత్వం తాజాగా కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.ఈ బులెటిన్ ప్రకారం భారత్ లో కొత్తగా 11,039 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,07,77,284కి చేరింది.ఇందులో 1,04,62,631 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  1,60,057 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 110 మంది మృతి చెందారు.దీంతో భారత్ లో కరోనాతో ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 1,54,596కి చేరింది.ఇక ప్రపంచంలో అతిపెద్ద కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ భారత్ లో జరుగుతున్నది.తాజా బులెటిన్ ప్రకారం భారత్లో ఇప్పటి వరకు 41,38,918 మందికి వ్యాక్సినేషన్ అందించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com