గ్రాండ్ మాస్క్ వద్ద 7.5 మిలియన్ల మందికి పైగా ఉమ్రాహ్ ప్రార్థనలు

- February 04, 2021 , by Maagulf
గ్రాండ్ మాస్క్ వద్ద 7.5 మిలియన్ల మందికి పైగా ఉమ్రాహ్ ప్రార్థనలు

రియాద్:అక్టోబర్ 4 నుంచి మొత్తంగా ఇప్పటివరకు గ్రాండ్ మాస్క్ వద్ద 7.5 మిలియన్ల మందికి పైగా ఉమ్రాహ్ ప్రార్థనల్ని నిర్వహించినట్లు ‘సౌదీ అరేబియా జనరల్ ప్రెసిడెన్సీ ఫర్ ది ఎఫైర్స్ ఆఫ్ టూ హోలీ మాస్క్స్’ వెల్లడించింది. వీరిలో ఉమ్రాహ్ చేసినవారు 1.9 మిలియన్ల మంది కాగా, వర్షిపర్స్ సంఖ్య 5.5 మిలియన్ల మంది. అక్టోబర్ 4 నుంచి జనవరి 30 మధ్య నమోదయిన గణాంకాలు ఇవి. జనరల్ డిపార్టుమెంట్ ఫర్ క్రౌడ్ మేనేజ్‌మెంట్ అండ్ గ్రూపింగ్ డైరెక్టర్ ఇంజనీర్ ఒసామా అల్ హుజైలి మాట్లాడుతూ, యాత్రీకులకు అన్ని సౌకర్యాలూ కల్పించేందుకు ప్రెసెడెన్సీ తగిన చర్యలు తీసుకుందని వివరించారు. నవంబర్ 1న ఉమ్రహ్ తిరిగి ప్రారంభమయ్యాక ప్రత్యేక ఏర్పాట్లు హోలీ కాబా వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. వీల్ ఛెయిర్ సౌకర్యం కూడా కల్పించారు. 155 లాంగ్ పాత్, 145 లాంగ్ పాత్ వంటి ఏర్పాట్లు చేయడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com