లాక్ డౌన్ సమయంలో కోవిడ్ రూల్ బ్రేక్ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- February 04, 2021
మస్కట్:లాక్ డౌన్ సమయంలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన ఓ వ్యక్తికి జైలు శిక్ష పడింది. కోవిడ్ 19 వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గతేడాది దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించిన విషయం తెలిసింది. అనంతరం నిబంధనలను సవరిస్తూ నైట్ కర్ఫ్యూని అమలులోకి తీసుకొచ్చింది ఒమన్ సుప్రీం కమిటీ. ఇలా అప్పటి పరిస్థితులకు అనుగుణంగా కొన్ని నిబంధనలను కఠినతరం చేస్తూ..మరికొన్నింటిని సడలిస్తూ వచ్చింది. అయితే..ప్రజలు మాత్రం ఫేస్ మాస్కులు ధరించటం, భౌతిక దూరం పాటించాలనే నిబంధనలను తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.కానీ, కొందరు వ్యక్తులు సుప్రీం కమిటీ సూచనలు పట్టించుకోకుండా నిబంధనలు ఉల్లంఘించటంతో వారిపై అప్పట్లో కేసులు నమోదు చేశారు అధికారులు.అలా ఓ వ్యక్తిపై నమోదైన కేసు నార్త్ షర్ఖియా గవర్నరేట్ పరిధిలోని ప్రాథమిక కోర్టు ముందు విచారణకు వచ్చింది. కేసును విచారించిన కోర్టు నిందితుడు ఉల్లంఘనకు పాల్పడినట్లు నిర్ధారించి అతనికి జైలు శిక్షను ఖరారు చేసింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







