లాక్ డౌన్ సమయంలో కోవిడ్ రూల్ బ్రేక్ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- February 04, 2021
మస్కట్:లాక్ డౌన్ సమయంలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన ఓ వ్యక్తికి జైలు శిక్ష పడింది. కోవిడ్ 19 వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గతేడాది దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించిన విషయం తెలిసింది. అనంతరం నిబంధనలను సవరిస్తూ నైట్ కర్ఫ్యూని అమలులోకి తీసుకొచ్చింది ఒమన్ సుప్రీం కమిటీ. ఇలా అప్పటి పరిస్థితులకు అనుగుణంగా కొన్ని నిబంధనలను కఠినతరం చేస్తూ..మరికొన్నింటిని సడలిస్తూ వచ్చింది. అయితే..ప్రజలు మాత్రం ఫేస్ మాస్కులు ధరించటం, భౌతిక దూరం పాటించాలనే నిబంధనలను తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.కానీ, కొందరు వ్యక్తులు సుప్రీం కమిటీ సూచనలు పట్టించుకోకుండా నిబంధనలు ఉల్లంఘించటంతో వారిపై అప్పట్లో కేసులు నమోదు చేశారు అధికారులు.అలా ఓ వ్యక్తిపై నమోదైన కేసు నార్త్ షర్ఖియా గవర్నరేట్ పరిధిలోని ప్రాథమిక కోర్టు ముందు విచారణకు వచ్చింది. కేసును విచారించిన కోర్టు నిందితుడు ఉల్లంఘనకు పాల్పడినట్లు నిర్ధారించి అతనికి జైలు శిక్షను ఖరారు చేసింది.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







