కోవిడ్ ఎఫెక్ట్: అజ్మన్ లో అర్ధరాత్రి తర్వాత హోటల్స్, కేఫ్ లు బంద్
- February 05, 2021
అజ్మన్ పరిధిలోని హోటల్స్, కేఫ్స్ సమయాలను కుదిస్తూ ఆర్ధికాభివృద్ధి అధికార విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఎట్టిపరిస్థితుల్లోని హోటల్స్, కేఫ్స్ మూసివేయాల్సిందేనని ఆదేశించింది. వినియోగదారులను అనుమతించొద్దని సూచించింది. అయితే..హోమ్ డెలివరీకి మాత్రం అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 5 నుంచి ఎమిరాతి పరిధిలోని అన్ని హోటళ్లు, కేఫ్ లు ఈ నిబంధన పాటించాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది. కోవిడ్ 19 వ్యాప్తి నియంత్రణకు యూఏఈ ఆరోగ్య శాఖ నిర్ణయం మేరకు పలు ఎమిరాతి పాలన యంత్రాంగాలు పలు రంగాలపై ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలె దుబాయ్ కూడా హోటల్స్, రెస్టారెంట్లను అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత మూసివేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అదే బాటలో అజ్మన్ పాలన యంత్రాంగం కూడా హోటల్స్, కేఫ్స్ పై ఆంక్షలను అమలులోకి తీసుకొచ్చింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







