కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే జీతంలో కోత..ఉద్యోగులకు కువైట్ వార్నింగ్
- February 05, 2021
కువైట్ సిటీ:ప్రజా ఆరోగ్య భద్రత కోసం సుప్రీం కమిటీ సూచించిన మార్గనిర్దేశకాలు పాటించని ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని సివిల్ సర్వీస్ కమిషన్ హెచ్చరించింది. సివిల్ సర్వీస్ డిక్రిలోని ఆర్టికల్ 60 మేరకు ప్రజా ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలకు ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ సూచించినట్లు ప్రతి ఉద్యోగి ముందస్తు జాగ్రత్తలు పాటించాల్సిందేనని ఒకవేళ ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. తొలిసారి ఉల్లంఘనకు పాల్పడితే వార్నింగ్ నోటీస్ ఇస్తామని, మళ్లీ అదే తప్పును కొనసాగిస్తే ఒక రోజు వేతనం కట్ చేస్తామని వివరించింది. మళ్లీ మళ్లీ నిబంధనలను ఉల్లంఘిస్తే జీతంలో కోతలు విధిస్తూనే ఉంటామని, గరిష్టంగా 15 రోజుల జీతాన్ని కట్ చేస్తామని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







