'నాంది' ట్రైలర్ విడుదల చేసిన మహేష్ బాబు
- February 06, 2021
హైదరాబాద్:కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న అల్లరి నరేష్ ‘నాంది’ సినిమాతో వస్తున్నాడు. విజయ్ కనకమేడల చిత్రానికి దర్శకత్వం వహించారు. సతీశ్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ లాయర్ గా కనిపించనుంది. ఈ సినిమాను ఫిబ్రవరి 19న విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ప్రయోగాత్మక చిత్రాలతో ఆకట్టుకునే నరేష్ ఇప్పుడు డిఫరెంట్ స్టోరీ సినిమాతో వస్తున్నాడు. సినిమా ఫస్ట్ లుక్ తోనే ఆడియెన్స్ ని ఆకట్టుకున్నాడు. టీజర్ లోను నరేష్ చెప్పే సంభాషణలు సినిమాపై ఆసక్తిని నెలకొల్పాయి. నాంది సినిమాలో క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు సామాజిక అంశాలపై మంచి మెసేజ్ ఇచ్చే విధంగా కొన్ని సీన్స్ ఉంటాయట. ఇది ఇలా ఉంటే... ఈ మూవీ ట్రైలర్ ఇవాళ రిలీజ్ అయింది. ప్రిన్స్ మహేష్బాబు చేతుల మీదుగా నాంది మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇక ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటుంది. "అందరూ నా జీవితం ఇక్కడ అయిపోయింది అని అనుకుంటారు.. కానీ ఇప్పుడే మొదలైంది" అంటూ ట్రైలర్లో అల్లరి నరేష్ ఇరగదీశాడు. ఇక మూవీ ఏ రేంజ్లో ఉంటుందో తెలియాలంటే రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









