కోవిడ్ టీకా చాలా సురక్షితం:టి.డీజీపీ మహేందర్ రెడ్డి
- February 06, 2021
హైదరాబాద్:కోవిడ్ టీకా చాలా సురక్షితమైందని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు.శనివారం తిలక్నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన కోవిడ్ వాక్సిన్ వేయించుకొని మీడియాతో మాట్లాడారు. కొవిడ్ టీకాపై అనుమానాలు, అపోహలు వద్దని సూచించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది ఇప్పటికే కోవిడ్ టీకా వేయించుకున్నారని,ప్రస్తుతం పోలీసు సిబ్బంది సైతం వేయించుకుంటున్నారని గుర్తుచేశారు.
ప్రజల్లో భయాలు, అపోహలు తొలగించేందుకు పోలీసుశాఖ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. కరోనా వ్యాప్తి సమయంలో వైద్యులు, పోలీసులు ప్రాణాలకు ఎదురొడ్డి సేవలు అందించారని పేర్కొన్నారు.తొలిదశలో కరోనా ఫ్రంట్లైన్ వారియర్స్కు టీకా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, త్వరలో సామాన్య ప్రజలకు టీకా అందుబాటులోకి వస్తుందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- రూ.10 వేలు దాటితే గంట వెయిటింగ్..డిజిటల్ మోసాలకు ఆర్బీఐ ‘చెక్’!
- ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేశ్ బత్తిని
- హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘హైదరాబాద్ స్ట్రీట్’ ప్రారంభం
- RGIAలో సుమారు ₹4.6 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం, ఇద్దరి అరెస్టు
- నగదు టోల్కు గుడ్బై..FASTag/UPI తప్పనిసరి
- ఇన్స్టాగ్రామ్లో టీనేజర్ల కోసం మెటా కొత్త రూల్స్ ఇవే
- మయన్మార్ అధ్యక్షుడిగా మిన్ ఆంగ్ హ్లాయింగ్ ప్రమాణ స్వీకారం
- తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
- హర్మూజ్ పై మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన
- యూఏఈ–భారత్ స్నేహాన్ని ప్రతిబింబిస్తూ విద్యార్థుల ప్రదర్శన









