కోవిడ్ టీకా చాలా సురక్షితం:టి.డీజీపీ మహేందర్ రెడ్డి
- February 06, 2021
హైదరాబాద్:కోవిడ్ టీకా చాలా సురక్షితమైందని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు.శనివారం తిలక్నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన కోవిడ్ వాక్సిన్ వేయించుకొని మీడియాతో మాట్లాడారు. కొవిడ్ టీకాపై అనుమానాలు, అపోహలు వద్దని సూచించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది ఇప్పటికే కోవిడ్ టీకా వేయించుకున్నారని,ప్రస్తుతం పోలీసు సిబ్బంది సైతం వేయించుకుంటున్నారని గుర్తుచేశారు.
ప్రజల్లో భయాలు, అపోహలు తొలగించేందుకు పోలీసుశాఖ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. కరోనా వ్యాప్తి సమయంలో వైద్యులు, పోలీసులు ప్రాణాలకు ఎదురొడ్డి సేవలు అందించారని పేర్కొన్నారు.తొలిదశలో కరోనా ఫ్రంట్లైన్ వారియర్స్కు టీకా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, త్వరలో సామాన్య ప్రజలకు టీకా అందుబాటులోకి వస్తుందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







