రియాద్ లో ప్రాంతీయ కార్యాలయాలను ప్రారంభించనున్న 24 ఇంటర్నేషనల్ కంపెనీలు
- February 06, 2021
రియాద్:అంతర్జాతీయ కంపెనీలను తమ వైపు ఆకర్షించాలన్న సౌదీ లక్ష్యానికి అనుగుణంగా అడుగులు పడుతున్నాయి. సౌదీ రాజధాని రియాద్ లో తమ ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ఏకంగా 24 అంతర్జాతీయ సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ మేరకు సౌదీ అధికార యంత్రాంగంతో అగ్రిమెంట్ కూడా చేసుకున్నాయి. రియాద్ లో ప్రాంతీయ కార్యాలయాలను ప్రారంభించనున్న ఇంటర్నేషనల్ కంపెనీల్లో పెప్సికో, టిమ్ హోర్టన్స్, బెచ్టెల్, బాష్, బోస్టన్ సైంటిఫిక్ వంటి మేటి సంస్థలు కూడా ఉన్నాయి. 2030 నాటికి ప్రపంచంలోని తొలి పది వాణిజ్య నగరాల్లో రియాద్ కు కూడా చోటు దక్కాలన్నది కింగ్డమ్ ప్రభుత్వ లక్ష్యం. అందుకు అనుగుణంగానే అంతర్జాతీయ కంపెనీల కార్యాలయాల ఏర్పాటుకు సౌదీ సాదరంగా అహ్వానం పలుకుతోంది. ప్రస్తుత ఒప్పందం మేరకు 24 సంస్థల ప్రాంతీయ కార్యాలయాల ఏర్పాటు ద్వారా జీతాలు, ఆఫీస్ నిర్వాహణ, మూలధన వ్యయం తరహా నిధులతో నేషనల్ ఎకనామికి 70 మిలియన్ల రియాల్స్ నిధులు సమకూరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







