రియాద్ లో ప్రాంతీయ కార్యాలయాలను ప్రారంభించనున్న 24 ఇంటర్నేషనల్ కంపెనీలు
- February 06, 2021
రియాద్:అంతర్జాతీయ కంపెనీలను తమ వైపు ఆకర్షించాలన్న సౌదీ లక్ష్యానికి అనుగుణంగా అడుగులు పడుతున్నాయి. సౌదీ రాజధాని రియాద్ లో తమ ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ఏకంగా 24 అంతర్జాతీయ సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ మేరకు సౌదీ అధికార యంత్రాంగంతో అగ్రిమెంట్ కూడా చేసుకున్నాయి. రియాద్ లో ప్రాంతీయ కార్యాలయాలను ప్రారంభించనున్న ఇంటర్నేషనల్ కంపెనీల్లో పెప్సికో, టిమ్ హోర్టన్స్, బెచ్టెల్, బాష్, బోస్టన్ సైంటిఫిక్ వంటి మేటి సంస్థలు కూడా ఉన్నాయి. 2030 నాటికి ప్రపంచంలోని తొలి పది వాణిజ్య నగరాల్లో రియాద్ కు కూడా చోటు దక్కాలన్నది కింగ్డమ్ ప్రభుత్వ లక్ష్యం. అందుకు అనుగుణంగానే అంతర్జాతీయ కంపెనీల కార్యాలయాల ఏర్పాటుకు సౌదీ సాదరంగా అహ్వానం పలుకుతోంది. ప్రస్తుత ఒప్పందం మేరకు 24 సంస్థల ప్రాంతీయ కార్యాలయాల ఏర్పాటు ద్వారా జీతాలు, ఆఫీస్ నిర్వాహణ, మూలధన వ్యయం తరహా నిధులతో నేషనల్ ఎకనామికి 70 మిలియన్ల రియాల్స్ నిధులు సమకూరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారం పై యూఏఈ అధ్యక్షుడు–బ్రిటన్ ప్రధాని చర్చలు
- కోల్కతా పై లక్నో విజయం
- ముంబై ఎయిర్పోర్ట్లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- సీజ్ఫైర్ ఒప్పందం..ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు
- CPTOగా ప్రసన్న ప్రసాద్ నియామకం
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!









