మినిస్ట్రి, ప్రభుత్వ ఆఫీసులకు సందర్శకుల సంఖ్యను కుదించిన ఖతార్
- February 06, 2021
దోహా:కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటికే పలు చర్యలు చేపట్టిన ఖతార్..లేటెస్ట్ గా మరో నిర్ణయం తీసుకుంది. వివిధ పనుల నిమిత్తం మంత్రుల కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే సందర్శకుల సంఖ్యను కుదించింది. గతంలో కంటే కేవలం 30 శాతం మందికే అనుమతి ఉంటుందని స్పష్టత ఇచ్చింది. కొద్ది రోజులుగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం..సెకండ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో గల్ఫ్ దేశాలన్ని ఆంక్షలను కఠినతరం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఖతార్ కు మంత్రులు, ప్రభుత్వ ఆఫీసులకు వచ్చే వారి సంఖ్యపై పరిమితి విధించింది. అయితే..దరఖాస్తులు, ఇతర సేవలను పొందాలనుకునే వారు హాట్ లైన్ 16008కి కాల్ చేసి తగిన వివరాలను పొందవచ్చని వెల్లడించింది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు, సేవలు పొందగలిగే పనులకు సంబంధించి సందర్శకులను అనుమతించబోమని కూడా స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







