చైనా దేశస్థుల ఆట కట్టించిన సైబరాబాద్ పోలీస్...

- February 08, 2021 , by Maagulf
చైనా దేశస్థుల ఆట కట్టించిన సైబరాబాద్ పోలీస్...

హైదరాబాద్:మల్టిలెవల్ మార్కెటింగ్ పేరు తో భారీ మోసానికి పాల్పడిన చైనా దేశస్థుల ఆట కట్టించారు సైబరాబాద్ పోలీసులు.బాధితుల పిర్యాదు మేరకు కేసును సీరియస్ గా తీసుకున్నారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పొలీసులు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 20 వేల మందిని మోసం చేసి 50 కోట్లు వసూళ్లు చేసింది ఈ చైనా బృందం.

అయితే ఈ మోసాలకు పాల్పడుతున్న ముగ్గరిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేయగా... మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు పోలీసులు. అయితే అరెస్ట్ చేసిన ఆ ముగ్గురిని  మీడియా ముందు ప్రవేశ పెట్టారు సైబరాబాద్ కమీషనర్ సజ్జనార్.ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కమీషనర్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com