ఎన్ఆర్ఐలకు గుడ్ న్యూస్..ఇండియాలో నేరుగా కంపెనీ ఏర్పాటుకు లైన్ క్లియర్
- February 09, 2021
2021-22 వార్షిక బడ్జెట్ లో విదేశీ పెట్టుబడులకు రూట్ క్లియర్ చేసిన కేంద్రం..ఎన్ఆర్ఐలకు గుడ్ న్యూస్ అందించింది.గల్ఫ్ దేశాల్లో ఉండున్న ఎన్ఆర్ఐలు వచ్చే ఏప్రిల్ నుంచి నుంచి ఇండియాలో సొంతంగా కంపెనీ స్టార్ట్ చేసుకోవచ్చు.గతంలో ఎన్ఆర్ఐలకు ఈ వెసులుబాటు లేదు. ఈ మేరకు కంపెనీస్ ఇన్కార్పోరేషన్ చట్టాన్ని సవరించి వన్ పర్సన్ కంపెనీస్ కు మార్గం సుగమమం చేసినట్లు అంతర్గత వాణిజ్యం, పారిశ్రామిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి గురుప్రసాద్ వెల్లడించారు.అంతేకాదు..ఎన్ఆర్ఐ పెట్టుబడులతో పరోక్షంగా ఏర్పాటు చేసిన కంపెనీలు లిమిటెడ్ కంపెనీలుగా మారటానికి గతంలో రెండు సంవత్సరాలు వేచి చూడాల్సి వచ్చేది. అలాగే మూలధనం వ్యయం 50 లక్షలు దాటినా వార్షిక టర్నోవర్ 2 కోట్ల రూపాయలకు చేరినా పరిమితులు ఉండేవి. కానీ, ఇప్పుడు ఆ అవరోధకాలు కూడా లేవు. ఎన్ఆర్ఐ తన సొంతంగా కంపెనీ ఏర్పాటు చేసుకోవటంతో పాటు లిమిటెడ్ కంపెనీగా మార్చుకునేందుకు గతంలో మాదిరిగా రెండేళ్లు వేచి చూడాల్సిన అవసరం లేదు. అలాగే మూలధన వ్యయం, వార్షిక టర్నోవర్ పై ఎలాంటి పరిమితులు లేవు. అలాగే ఎన్ఆర్ఐలు ఇండియాలో ఉండాల్సిన సమయాన్ని 182 నుంచి 120 రోజులకు కుదించింది. దీంతో వన్ పర్సన్ కంపెనీస్ పెరిగే అవకాశాలు ఉన్నాయని గురుప్రసాద్ వెల్లడించారు. గ్లోబల్ మీడియా డేటా మేరకు ఒక్క సౌదీ అరేబియాలోనే 15 లక్షల మంది ఎన్ఆర్ఐలు ఉన్నారని, భారత ప్రభుత్వం ఓపీసీల ప్రొత్సాహానికి ప్రకటించిన అవకాశాన్ని ఆసక్తిగల పారిశ్రామికవేత్తలు వినియోగించుకుంటారని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన కువైట్ విదేశాంగ మంత్రి
- ఏపీ రాజధానిగా అమరావతి ఖరారు..కేంద్రం అధికారిక గెజిట్ విడుదల
- ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టేస్తాం: డోనాల్డ్ ట్రంప్
- విశాఖలో డేటా సెంటర్ శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్
- ఏపీలో విచిత్ర వాతవరణం: మండుతున్న ఎండలు.. కురుస్తున్న వర్షాలు
- ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు ముహూర్తం ఫిక్స్
- ఒకే ఫోన్ కాల్తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!









