ప్రవాసీయులకు నాణ్యమైన సేవలు అందించేందుకు తవాసుల్ సర్వీస్ ప్రారంభం
- February 11, 2021
రియాద్:పాస్ పోర్ట్ డైరెక్టరేట్ కార్యాలయం-జావాజత్ తమ సేవల్లో మరింత నాణ్యత పెంచేందుకుగాను తవాసుల్ సర్వీస్ ను ప్రారంభించినట్లు వెల్లడించింది.ముఖీమ్ పోర్టల్ లో భాగంగా తవాసుల్ సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు జావాజత్ అధికారులు వివరించారు. దీనిద్వారా ప్రవాసీయులు అధిక ప్రయోజనం పొందే అవకాశాలు ఉన్నాయన్నారు. వినియోగదారులు తమ పొందాలనుకుంటున్న సేవలకు సంబంధించి సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకున్నా..ఇంకా పని పూర్తికాకుంటే తవాసుల్ సర్వీస్ ద్వారా ఆయా దరఖాస్తులు వేగంగా పరిష్కరించేలా కృషి జరుగుతుందని జావాజత్ అధికారులు వివరించారు. పెండింగ్ దరఖాస్తులకు సంబంధించి తవాసుల్ ఆన్ లైన్ సర్వీస్ ద్వారా సేవలను కోరిన పక్షంలో జావాజాత్ లోని సంబంధిత అధికారులతో కమ్యూనికేట్ అయ్యేలా చర్యలు ప్రారంభం అవుతాయని అన్నారు. దీని ద్వారా సేవలు కోరే వ్యక్తి నేరుగా జావాజత్ కార్యాలయాన్ని సంప్రదించాల్సిన అవసరం లేదని..ఆన్ లైన్లోనే నాణ్యమైన, వేగవంతమైన సేవలను పొందవచ్చని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







