ప్రవాసీయులకు నాణ్యమైన సేవలు అందించేందుకు తవాసుల్ సర్వీస్ ప్రారంభం
- February 11, 2021
రియాద్:పాస్ పోర్ట్ డైరెక్టరేట్ కార్యాలయం-జావాజత్ తమ సేవల్లో మరింత నాణ్యత పెంచేందుకుగాను తవాసుల్ సర్వీస్ ను ప్రారంభించినట్లు వెల్లడించింది.ముఖీమ్ పోర్టల్ లో భాగంగా తవాసుల్ సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు జావాజత్ అధికారులు వివరించారు. దీనిద్వారా ప్రవాసీయులు అధిక ప్రయోజనం పొందే అవకాశాలు ఉన్నాయన్నారు. వినియోగదారులు తమ పొందాలనుకుంటున్న సేవలకు సంబంధించి సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకున్నా..ఇంకా పని పూర్తికాకుంటే తవాసుల్ సర్వీస్ ద్వారా ఆయా దరఖాస్తులు వేగంగా పరిష్కరించేలా కృషి జరుగుతుందని జావాజత్ అధికారులు వివరించారు. పెండింగ్ దరఖాస్తులకు సంబంధించి తవాసుల్ ఆన్ లైన్ సర్వీస్ ద్వారా సేవలను కోరిన పక్షంలో జావాజాత్ లోని సంబంధిత అధికారులతో కమ్యూనికేట్ అయ్యేలా చర్యలు ప్రారంభం అవుతాయని అన్నారు. దీని ద్వారా సేవలు కోరే వ్యక్తి నేరుగా జావాజత్ కార్యాలయాన్ని సంప్రదించాల్సిన అవసరం లేదని..ఆన్ లైన్లోనే నాణ్యమైన, వేగవంతమైన సేవలను పొందవచ్చని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారం పై యూఏఈ అధ్యక్షుడు–బ్రిటన్ ప్రధాని చర్చలు
- కోల్కతా పై లక్నో విజయం
- ముంబై ఎయిర్పోర్ట్లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- సీజ్ఫైర్ ఒప్పందం..ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు
- CPTOగా ప్రసన్న ప్రసాద్ నియామకం
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!









