ప్రవాసీయులకు నాణ్యమైన సేవలు అందించేందుకు తవాసుల్ సర్వీస్ ప్రారంభం
- February 11, 2021
రియాద్:పాస్ పోర్ట్ డైరెక్టరేట్ కార్యాలయం-జావాజత్ తమ సేవల్లో మరింత నాణ్యత పెంచేందుకుగాను తవాసుల్ సర్వీస్ ను ప్రారంభించినట్లు వెల్లడించింది.ముఖీమ్ పోర్టల్ లో భాగంగా తవాసుల్ సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు జావాజత్ అధికారులు వివరించారు. దీనిద్వారా ప్రవాసీయులు అధిక ప్రయోజనం పొందే అవకాశాలు ఉన్నాయన్నారు. వినియోగదారులు తమ పొందాలనుకుంటున్న సేవలకు సంబంధించి సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకున్నా..ఇంకా పని పూర్తికాకుంటే తవాసుల్ సర్వీస్ ద్వారా ఆయా దరఖాస్తులు వేగంగా పరిష్కరించేలా కృషి జరుగుతుందని జావాజత్ అధికారులు వివరించారు. పెండింగ్ దరఖాస్తులకు సంబంధించి తవాసుల్ ఆన్ లైన్ సర్వీస్ ద్వారా సేవలను కోరిన పక్షంలో జావాజాత్ లోని సంబంధిత అధికారులతో కమ్యూనికేట్ అయ్యేలా చర్యలు ప్రారంభం అవుతాయని అన్నారు. దీని ద్వారా సేవలు కోరే వ్యక్తి నేరుగా జావాజత్ కార్యాలయాన్ని సంప్రదించాల్సిన అవసరం లేదని..ఆన్ లైన్లోనే నాణ్యమైన, వేగవంతమైన సేవలను పొందవచ్చని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ముహర్రక్ నైట్స్ ఫెస్టివల్ ను సందర్శించిన విదేశాంగ మంత్రి..!!
- కువైట్లో ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిజం ప్రమోషన్స్..!!
- ఇబ్రిలో స్టంట్ డ్రైవింగ్..ఎనిమిది మంది డ్రైవర్లు అరెస్ట్..!!
- జంతువులను వదిలేస్తున్నారా? కఠిన చర్యలు..!!
- ఖలీద్ బిన్ అహ్మద్ ఇంటర్ఛేంజ్ ఎగ్జిట్ మూసివేత..!!
- తొలి ఆర్వీ రూట్ ను ప్రారంభించిన దుబాయ్..!!
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…







