హోటల్ రూం బుక్ చేసుకుంటేనే దేశంలోకి అనుమతి..
- February 12, 2021
మస్కట్:విదేశాల నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణికుల పట్ల అప్రమత్తంగా ఉంటున్న ఒమన్ ప్రభుత్వం..ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా కొత్త సూచనలు చేస్తూ వస్తోంది. ప్రయాణికుల క్వారంటైన్ నిబంధనను పకడ్బందీగా అమలు చేసేందుకు లేటెస్ట్ మరో ఉత్వర్వులు జారీ చేసింది. ఒమన్ వచ్చే ప్రయాణికులు అందరూ క్వారంటైన్ లో ఉండేందుకు వీలుగా ప్రయాణానికి ముందే హోటల్ లో రూం బుకింగ్ చేసుకోవాలని సూచించింది. వారం పాటు అంటే ఏడు రాత్రులు హోటల్ లో ప్రీ బుకింగ్ చేసుకున్నట్లు ఆధారాలు చూపితేనే టికెట్లను కన్ఫమ్ చేయాలంటూ ఒమన్ కు సర్వీసులను నడిపే ఎయిర్ లైన్స్ సంస్థలను విమాయాన సంస్థ ఆదేశించింది. క్వారంటైన్ లో ఉండేందుకు ఒమన్ లోని ఏ హోటల్ లోనైనా రూం బుక్ చేసుకోవచ్చని..హోటల్ ఎంపిక సునాయసంగా చేసుకునేందుకు అధికారులు అప్ డేట్ చేసిన జాబితాను పరిశీలిస్తే మంచిదని సూచించింది. కొత్త నిబంధన ఫిబ్రవరి 12 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది. కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టేందుకు ఏర్పాటైన సుప్రీం కమిటీ సూచనల మేరకే విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేశామని సీఏఏ వివరించింది.
తాజా వార్తలు
- అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే
- తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం
- టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది
- టీ20 సిరీస్ టీమిండియాదే
- మేరీల్యాండ్లో మెరిసిన తెలుగు ఆణిముత్యాలు
- ముసాందంలో వరదల్లో డ్రైవింగ్.. డ్రైవర్ అరెస్ట్..!!
- అత్యున్నత పురస్కారాల్లో ప్రధాని మోదీ రికార్డు..!!
- ఏనుగు సజీవ దహనం..ముగ్గురు అరెస్ట్..!!
- 72 మిలియన్ గ్యాలన్ల రెయిన్ వాటర్ తొలగింపు..!!
- మెచ్యూరిటీ ఇండెక్స్ 2025లో సౌదీకి రెండో స్థానం..!!







