భారతీయులు కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ కాన్సులేట్ సూచన
- February 12, 2021
దుబాయ్:యూఏఈలో గత కొంత కాలంగా కోవిడ్ కేసులు పెరుగుతుండటం పట్ల ఇండియన్ కాన్సులేట్ కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది.పెరుగుతున్న వైరస్ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని యూఏఈలోని అతిపెద్ద వలస సమాజమైన భారతీయులు అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ కాన్సులేట్ కార్యాలయం సూచించింది.మనల్ని మనం రక్షించుకుంటూ, సమాజ శ్రేయస్సు కోసం యూఏలోని ప్రతి భారతీయుడు బాధ్యతతో వ్యవహరించాల్సిన సమయం అని పేర్కొంది.యూఏఈ ప్రభుత్వం సూచనల మేరకు ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, తప్పనిసరిగా ఫేస్ మాస్కులు ధరించాలని తెలిపింది. ప్రతి చోట భౌతిక దూరం పాటించాలని కోరింది.అంతేకాదు..వివిధ పనులు, సేవలు పొందే నిమిత్తం కాన్సులేట్ కార్యాలయానికి రావాలనుకునే వారు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించింది.ముందు జాగ్రత్త చర్యలను పాటించటంలో భాగంగా అత్యవసరమైతే తప్ప నేరుగా కాన్సులేట్ కార్యాలయానికి రావొద్దని సూచించింది.కాన్సులేట్ కార్యాలయం నుంచి సేవలను పొందాలనుకునే వారు కాన్పులేట్ అందిస్తున్న ఆన్ లైన్ సేవలను వినియోగించుకోవాలని వెల్లడించింది. అందుకు అందుబాటులో ఉన్న అవకాశాలను వివరిస్తూ..80046342 ఫోన్ లైన్ ద్వారా ప్రతి రోజు 24 గంటలు తమను సంప్రదించవచ్చని పేర్కొంది. అలాగే పీబీఎస్కే యాప్ ద్వారాగానీ, [email protected] కి మెయిల్ ద్వారాగానీ, +971-54-3090571 వాట్స్ యాప్ ద్వారాగానీ కాన్సులేట్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చిని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







