ఇల్లందులో ‘ఆచార్య’ షూటింగ్ కు ఏర్పాట్లు
- February 12, 2021
ఖమ్మం:మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రం షూటింగ్ ఇల్లందు జేకే మైన్స్ లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కొరటాల శివ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 7 నుండి 15వ తేదీ వరకు ఇల్లందు జేకే మైన్స్ ఓపెన్ కాస్ట్ మరియు అండర్ గ్రౌండ్ మైనింగ్ లో షూటింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో చిత్ర హీరో చిరంజీవి, రాంచరణ్ పై సన్నివేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అందుకు తగు అనుమతులు కల్పించాలని చిత్ర దర్శకుడు కొరటాల శివ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి పువ్వాడ చిత్ర షూటింగ్ కోసం స్థానికంగా అనుమతులతో పాటు చిత్ర హీరో చిరంజీవికి తానే తన నివాసంలో ఆతిధ్యం ఏర్పాటు చేస్తామని వారికి తెలిపారు. మిగతా జిల్లాలతో పోల్చితే పర్యాటక రంగంగా ఉమ్మడి ఖమ్మం అభివృద్ధి చెందిందని, వివిధ చిత్రాల షూటింగ్ ల కోసం కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంతో అనువైన ప్రదేశమని కొరటాల శివ పేర్కొన్నారు. గతంతో పోల్చితే ఖమ్మం స్వరూపం పూర్తిగా మారిపోయిందని అందుకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి అభినందనలు తెలియజేశారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం
- 40 మంది సభ్యులతో గవర్నర్ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్లు ఇక టెక్ట్స్లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్లో వాహనాలు స్వాధీనం..!!







