వ్యక్తిగత పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న బహ్రెయిన్ రాజు

- February 16, 2021 , by Maagulf
వ్యక్తిగత పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న బహ్రెయిన్ రాజు

మనామా:బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా యూఏఈ చేరుకున్నారు.వ్యక్తిగత పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న బహ్రెయిన్ రాజుకు యూఏఈ సాదర స్వాగతం పలికింది. అల్ అఫ్రా ప్రాంత పాలకుల ప్రతినిధిగా షేక్ అహ్మద్ బిన్ జయద్ అల్ నెహ్యాన్ విమానాశ్రయంలో బహ్రెయిన్ రాజుకు స్వాగతం పలికారు.రాజు ఖలీఫా వెంట బహ్రెయిన్ ప్రతినిధుల బృందం కూడా ఉంది.అల్ నెహ్యాన్ తో పాటు రాజుకు స్వాగతం పలికిన వారిలో పలువురు షేక్ లు, సీనియర్ అధికారులు, యూఏఈలోని బహ్రెయిన్ అంబాసిడర్ ఉన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com