డ్రైవింగ్ టెస్ట్ మోసం: ప్రభుత్వ ఉద్యోగులకు జైలు

- February 19, 2021 , by Maagulf
డ్రైవింగ్ టెస్ట్ మోసం: ప్రభుత్వ ఉద్యోగులకు జైలు

బహ్రెయిన్:  హై క్రిమినల్ కోర్టు, ఇద్దరు పబ్లిక్ సర్వీస్ ఉద్యోగులకు జైలు శిక్ష విధించింది. తమ అధికారిక పదవుల్ని దుర్వినియోగం చేసినందుకు వీరికి శిక్ష ఖరారు చేసింది న్యాయస్థానం. డ్రైవింగ్ టెస్ట్ సందర్భంగా కొందరికి అక్రమంగా పాస్ అయినట్లు ప్రకటించడమే నిందితులు చేసిన నేరం. నిందితులు ఇద్దరికి ఏడేళ్ళ జైలు శిక్ష విధించగా, ఒకరికి ఆరేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఫైనాన్షియల్ క్రైమ్ మరియు మనీ లాండరింగ్ ప్రాసిక్యూషన్ హెడ్ మాట్లాడుతూ, ఇద్దరు నిందితులు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ఉద్యోగులని తెలిపారు. ఓ నిందితుడ్ని శిక్ష ముగిశాక డిపోర్ట్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com