డ్రైవింగ్ టెస్ట్ మోసం: ప్రభుత్వ ఉద్యోగులకు జైలు
- February 19, 2021
బహ్రెయిన్: హై క్రిమినల్ కోర్టు, ఇద్దరు పబ్లిక్ సర్వీస్ ఉద్యోగులకు జైలు శిక్ష విధించింది. తమ అధికారిక పదవుల్ని దుర్వినియోగం చేసినందుకు వీరికి శిక్ష ఖరారు చేసింది న్యాయస్థానం. డ్రైవింగ్ టెస్ట్ సందర్భంగా కొందరికి అక్రమంగా పాస్ అయినట్లు ప్రకటించడమే నిందితులు చేసిన నేరం. నిందితులు ఇద్దరికి ఏడేళ్ళ జైలు శిక్ష విధించగా, ఒకరికి ఆరేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఫైనాన్షియల్ క్రైమ్ మరియు మనీ లాండరింగ్ ప్రాసిక్యూషన్ హెడ్ మాట్లాడుతూ, ఇద్దరు నిందితులు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ఉద్యోగులని తెలిపారు. ఓ నిందితుడ్ని శిక్ష ముగిశాక డిపోర్ట్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









