పుదుచ్చేరి నుండి టి.గవర్నర్ సమీక్ష
- February 19, 2021
పుదుచ్చేరి:పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు స్వీకరించిన రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ ఈరోజు పుదుచ్చేరి నుండి తెలంగాణ రాష్ట్ర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
పుదుచ్చేరి రాజ్ నివాస్ నుండి గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైదరాబాద్ రాజ్ భవన్ అధికారులతో తెలంగాణ రాష్ట్ర అంశాలకు సంబంధించిన వివిధ విషయాలపై సమగ్రంగా సమీక్ష చేశారు.

“నేను పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు స్వీకరించినప్పటికీ, తెలంగాణకు సంబంధించిన విషయాలపై, ఇతర డెవలప్ మెంట్స్ పై నేను తెలుసుకుంటూనే ఉన్నాను”.
“తెలంగాణ ప్రజల సంక్షేమం, బాగోగులు నాకు అత్యంత ప్రాధాన్యత. నేను పుదుచ్చేరిలో ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం పట్ల అణుక్షణం నా తపన అలానే ఉంది”.
“నేను మీకు (రాజ్ భవన్, హైదరాబాద్ అధికారులకు) ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటాను. అవసరమైన విషయాలు నా దృష్టికి తీసుకురండి” అని సూచించారు.
తెలంగాణ రాష్ట్రం, ప్రజలకు సంబంధించిన విషయాలు నాకు అత్యంత ప్రాధాన్యం అని డా. తమిళిసై సౌందరరాజన్ వివరించారు.
సెక్రటరి టు గవర్నర్ కె. సురేంద్ర మోహన్ పుదుచ్చేరి నుండి గవర్నర్ తో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. హైదరాబాద్ రాజ్ భవన్ నుండి గవర్నర్ సలహాదారులు, జాయింట్ సెక్రటరీలు, ఇతర అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







