మన్సూరాలో తాత్కాలిక ట్రాఫిక్ డైవర్షన్
- February 26, 2016
పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్ఘాల్) తాత్కాలిక ట్రాఫిక్ డైవర్షన్ గురించిన ప్రకటన చేసింది. అల్ మన్సూరా అల్ మట్టార్ ఇంటర్సెక్షన్లో ఈ డైవర్షన్ అమల్లో ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్స్కి చెందిన ట్రాఫిక్ సేఫ్టీ మరియు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, అష్గల్ సంయుక్తంగా ఈ ప్రకటన విడుదల చేశారు. మూడు వారాల పాటు అల్ మట్టర్ స్ట్రీట్పై ట్రాఫిక్ డైవర్షన్ తప్పనిసరి. అలాగే అల్ మన్సూరా స్ట్రీట్ డైవర్షన్ ఆరు వారాలపాటు ఉంటుంది. అండర్ గ్రౌండ్ సీవేజ్ నెట్ వర్క్కి సంబంధించిన పనుల కారణంగా ఈ డైవర్షన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ట్రాఫిక్ డైవర్షన్కి సంబంధించిన వివరాల్ని తెలియజేస్తూ ఓ మ్యాప్ని కూడా విడుదల చేశారు. అలాగే డైవర్షన్ల వద్ద వాహనదారులకు ఇబ్బందులు లేకుండా మార్కింగ్, అలాగే డైవర్షన్ గుర్తులను ఏర్పాటు చేయడం జరిగింది. వాహనదారులంతా ఈ ప్రకటనను దృష్టిలో ఉంచుకుని సహకరించాలనీ, అలాగే వేగ నియంత్రణను పాటించాలని కోరారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







