దుబాయ్ ఫిలిం ఫెస్టివల్లో మహిళల సమస్యలపై దృష్టి
- February 26, 2016
వచ్చే నెలలో జరగనున్న దుబాయ్ ఫిలిం ఫెస్టివల్లో మహిళలపై హింసపై చర్చా కార్యక్రమాలు జరగనున్నాయి. వరల్డ్ ఆఫ్ విమెన్ ఫిలిం ఫెయిర్ మార్చ్ 5న ప్రారంభం కానుంది. మార్చ్ 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం. వరల్డ్ ఆఫ్ విమెన్ ఫౌండర్ హెర్మోయిన్ మకురా మాట్లాడుతూ, మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సంబంధించిన చర్చలపై చర్చ జరగాలని అన్నారు. మహిళల సమస్యలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరగాల్సి ఉందనీ, ఈ ఏడాది ముఖ్యమైన అంశాలు చర్చకు వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారామె. హ్యూమన్ ట్రాఫికింగ్, అలాగే మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్ళపైనా ఫోకస్ పెరగాల్సిన అవసరం ఉందన్నారు. వైవాహిక జీవితానికి ముందు, తర్వాత కూడా మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు మకురా. ఫౌండేషన్ జనరల్ సెక్రెటరీ అఫ్రా అల్ బస్తి మాట్లాడుతూ, యూఏఈ ఈ అంశాల్ని చాలా సీరియస్గా తీసుకుందని అన్నారు. ఈ విభాగంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. బ్రిటిష్ లాయర్ ఖతిజా సక్రైన్ మాట్లాడుతూ, గృహ హింస, అవమానం ప్రపంచ వ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య అని అన్నారు. ఇరాక్లో జఫారి చట్టం బాల్య వివాహాల్ని చట్టబద్ధం చేయడం దారుణమని వక్తలు అభిప్రాయం వెలిబుచ్చారు. మూడు రోజుల ఫిలిం ఫెస్టివల్ మార్చ్ 8 వరకు సాగుతుంది.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







