దుబాయ్: పీసీఆర్ రిపోర్ట్స్ విక్రయిస్తున్న ట్రావెల్ ఏజెన్సీ సీజ్
- February 20, 2021
దుబాయ్:కోవిడ్ కట్టడి కోసం ప్రయాణాలు, ఉద్యోగులు విధులకు హజరయ్యేందుకు పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ ఇప్పుడు తప్పనిసరి. ఈ అవకాశాన్ని వినియోగించుకొని అడ్డదారిలో డబ్బు సంపాదించేందుకు అక్రమ మార్గాల్లో పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ ను అమ్మకాలకు పెట్టింది ఓ ట్రావెల్ ఏజెన్సీ. దుబాయ్ లో సేవలు అందిస్తున్న ఆ ట్రావెల్ ఏజెన్సీ..ఓ ల్యాబరేటరీ సౌజన్యంతో వాట్సాప్ ద్వారా పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ లను జారీ చేస్తూ వస్తోంది. ఇందుకోసం ఇంటిదగ్గరికే వచ్చి పరీక్షలు కూడా నిర్వహిస్తోంది. అయితే..ఓ వినియోగదారుడు ట్రావెల్ ఏజెన్సీ సేవలు, ఇంటి దగ్గరికి వచ్చి పరిశీలించిన విధానం సరిగ్గా లేవంటూ దుబాయ్ హెల్త్ అథారిటీ, వాణిజ్య నియంత్రణ విభాగానికి ఫిర్యాదు చేయటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వినియోగదారుడి ఫిర్యాదుతో అప్రమత్తమైన వాణిజ్య నియంత్రణ విభాగం వెంటనే ట్రావెల్ ఏజెన్సీ ఆఫీసును పరిశీలించి విచారణ చేపట్టారు. వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ద్వారా వినియోగదారుల వివరాలు, పాస్ పోర్ట్ కాపీ తీసుకొని ఆ తర్వాత ఆన్ లైన్ ద్వారా టెస్ట్ ఫీజు
వసూలు చేస్తున్నట్లు గుర్తించింది. కోవిడ్ సమయంలో సమాజ ఆరోగ్య భద్రతకు హాని కలిగించేలా వ్యవహరించటంతో పాటు చట్టాలకు విరుద్ధంగా పీసీఆర్ టెస్ట్ రిపోర్టులను జారీ చేస్తున్నారనే ఆరోపణలతో ట్రావెల్ ఏజెన్సీ మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ట్రావెల్ ఏజెన్సీతో లింక్ అయిన ల్యాబరేటరీ వివరాలను దుబాయ్ ఆరోగ్య శాఖ యంత్రాగానికి అందించామని వెల్లడించారు. యూఏఈ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, దుబాయ్ హెల్త్ అథారిటీ నుంచి అనుమతి పొందిన ఆరోగ్య సంస్థలు, ల్యాబరేటరీలకు మాత్రమే పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ లను జారీ చేసేందుకు అర్హత ఉందని స్పష్టం చేశారు అధికారులు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







