కువైట్‌ని వీడిన 134,000 మంది వలసదారులు

- February 22, 2021 , by Maagulf
కువైట్‌ని వీడిన 134,000 మంది వలసదారులు

కువైట్ జనాభా 2020లో తగ్గింది. మొత్తం 105,694 మంది తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2.2 వాతంగా ఈ తగ్గుదల నమోదయ్యింది. 2020 చివరి నాటికి కువైట్ జనాభా 4,670,000గా నమోదయ్యింది. అంతకు ముందు ఏడాది ఈ సంఖ్య 4,776,000గా వుంది. కువైట్‌లో ప్రస్తుతం నివసిస్తున్న వలసదారుల సంఖ్య 4 శాతం తగ్గింది. 2020 జనవరి మరియు డిసెంబర్ మధ్య 134,000 మంది వలసదారులు దేశం విడిచి వెళ్ళిపోయారు. వీరిలో 52 శాతం మంది భారతీయులే వున్నట్లు తెలుస్తోంది. 2019 నాటికి యువైట్‌లో  వలసదారుల సంఖ్య 3,344,000 కాగా, ప్రస్తుతం 3,210,000గా నమోదయ్యింది. 6.57 శాతం మంది భారతీయులు కువైట్ వదిలి స్వదేశానికి చేరుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com