ఇండియా విమానాల్లో పిల్లలకు పీసీఆర్ కోవిడ్ టెస్ట్ తప్పనిసరి
- February 22, 2021
యూఏఈ:ఇండియాకి వచ్చే అన్ని విమానాల్లో పిల్లలకు పిసిఆర్ టెస్ట్ ఫిబ్రవరి 22 నుంచి తప్పనిసరి చేశారు. అన్ని వయసులకు చెందిన పిల్లలకూ ఇది తప్పనిసరి చేయడం జరిగింది. ఈ మేరకు న్యూ డిల్లీ ఎయిర్ పోర్టులో ఎఫ్ఎక్యు పబ్లిష్ చేయడం జరిగింది.యూఏఈ ఈ విషయాన్ని ధృవీకరించింది.కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త మ్యుటేషన్ల నేపథ్యంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. పిసిఆర్ టెస్ట్ ప్రయాణీకులందరికీ తప్పనిసరి.కుటుంబ సభ్యుల మరణం నేపథ్యంలో వచ్చేవారికి మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపునిస్తారు.అలాంటి వ్యక్తులు 72 గంటల ముందుగా ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని పోర్టల్లో పొందుపర్చుతారు.పిసిఆర్ నెగెటివ్ టెస్ట్ రిపోర్టుని ప్రయాణీకులంతా సమర్పించాల్సి వుంటుంది. కాగా, యూకే, యూరోప్, బ్రెజిల్ మరియు ఆఫ్రికా నుంచి వచ్చేవారికి ప్రత్యేక ప్రోటోకాల్ వుంటుంది.పిసిఆర్ టెస్ట్ నెగెటివ్ రిపోర్ట్ సమర్పించినవారు 14 రోజులపాటు తమ ఆరోగ్యాన్ని స్వయంగా మానిటర్ చేసుకోవాలి.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







