ఇండియా విమానాల్లో పిల్లలకు పీసీఆర్ కోవిడ్ టెస్ట్ తప్పనిసరి
- February 22, 2021
యూఏఈ:ఇండియాకి వచ్చే అన్ని విమానాల్లో పిల్లలకు పిసిఆర్ టెస్ట్ ఫిబ్రవరి 22 నుంచి తప్పనిసరి చేశారు. అన్ని వయసులకు చెందిన పిల్లలకూ ఇది తప్పనిసరి చేయడం జరిగింది. ఈ మేరకు న్యూ డిల్లీ ఎయిర్ పోర్టులో ఎఫ్ఎక్యు పబ్లిష్ చేయడం జరిగింది.యూఏఈ ఈ విషయాన్ని ధృవీకరించింది.కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త మ్యుటేషన్ల నేపథ్యంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. పిసిఆర్ టెస్ట్ ప్రయాణీకులందరికీ తప్పనిసరి.కుటుంబ సభ్యుల మరణం నేపథ్యంలో వచ్చేవారికి మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపునిస్తారు.అలాంటి వ్యక్తులు 72 గంటల ముందుగా ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని పోర్టల్లో పొందుపర్చుతారు.పిసిఆర్ నెగెటివ్ టెస్ట్ రిపోర్టుని ప్రయాణీకులంతా సమర్పించాల్సి వుంటుంది. కాగా, యూకే, యూరోప్, బ్రెజిల్ మరియు ఆఫ్రికా నుంచి వచ్చేవారికి ప్రత్యేక ప్రోటోకాల్ వుంటుంది.పిసిఆర్ టెస్ట్ నెగెటివ్ రిపోర్ట్ సమర్పించినవారు 14 రోజులపాటు తమ ఆరోగ్యాన్ని స్వయంగా మానిటర్ చేసుకోవాలి.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







