భారత్ లో కరోనా కేసుల వివరాలు

- February 23, 2021 , by Maagulf
భారత్ లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా ఉధృతి కొనసాగుతోంది.దేశంలో కరోనా వ్యాక్సిన్ ఇస్తున్న పాజిటివ్ కేసుల సంఖ్య‌ మాత్రం తగ్గడం లేదు.తాజాగా దేశంలో 10,584 కరోనా కేసులు న‌మోద‌య్యాయి.దీంతో భారత్ లో మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన క‌రోనా కేసుల సంఖ్య 1,10,16,434 కు చేరింది.ఇందులో 1,07,12,665  మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,47,306  కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.గ‌డిచిన 24 గంట‌ల్లో భారత్ లో క‌రోనాతో 78 మంది మృతి చెందారు.దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు భారత్ లో క‌రోనాతో మృతిచెందిన‌వారి సంఖ్య 1,56,463  కు చేరింది.ఇక దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 1,17,45,552 మందికి వ్యాక్సిన్‌ను ఇవ్వ‌డం విశేషం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com