రెండ్రోజుల్లో కువైట్ చేరుకున్న 1,442 మంది ప్రయాణికులు
- February 23, 2021కువైట్ సిటీ:విమానాశ్రయం తిరిగి ప్రారంభమయ్యాక 48 గంటల్లోనే 1,442 మంది ప్రయాణికులు దేశానికి చేరుకున్నట్లు కువైట్ ప్రకటించింది. 48 గంటల్లో 48 విమానాలు కువైట్ విమానాశ్రయానికి చేరుకున్నాయని, దేశానికి చేరుకున్న 1,442 మంది ప్రయాణికుల్లో 989 పౌరులు, 453 మంది గృహ కార్మికులు ఉన్నారని వెల్లడించింది. విమాన సర్వీసులు ప్రారంభం అయిన తొలి రోజున 25 విమానాల్లో 713 మంది ప్రయాణికులు, రెండో రోజున 22 విమానాల్లో 729 మంది ప్రయాణికులు ఎయిర్ పోర్టుకు చేరుకున్నాయని వివరించింది. కువైట్ వస్తున్న ప్రయాణికుల్లో ఎక్కువ మంది టర్కి, ఇండియన్లు ఉన్నారని తెలిపింది. కువైట్ పౌరులు కువైట్ మొసఫర్, డొమస్టిక్ వర్కర్లు బెల్ సలామ్ ద్వారా ముందస్తుగా రిజిస్టర్ చేసుకున్న తర్వాత దేశానికి చేరుకున్నారని వెల్లడించింది. అయితే..ఇతర దేశాల నుంచి కువైట్ చేరుకుంటున్న ప్రతి ఒక్కరికి పీసీఆర్ టెస్టులు నిర్వహించి క్వారంటైన్ తరలిస్తున్నామని తెలిపింది. క్వారంటైన్ కోసం పలు హోటల్స్ ని కేటాయించినట్లు కువైట్ వివరించింది.
తాజా వార్తలు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA