రెండ్రోజుల్లో కువైట్ చేరుకున్న 1,442 మంది ప్రయాణికులు
- February 23, 2021
కువైట్ సిటీ:విమానాశ్రయం తిరిగి ప్రారంభమయ్యాక 48 గంటల్లోనే 1,442 మంది ప్రయాణికులు దేశానికి చేరుకున్నట్లు కువైట్ ప్రకటించింది. 48 గంటల్లో 48 విమానాలు కువైట్ విమానాశ్రయానికి చేరుకున్నాయని, దేశానికి చేరుకున్న 1,442 మంది ప్రయాణికుల్లో 989 పౌరులు, 453 మంది గృహ కార్మికులు ఉన్నారని వెల్లడించింది. విమాన సర్వీసులు ప్రారంభం అయిన తొలి రోజున 25 విమానాల్లో 713 మంది ప్రయాణికులు, రెండో రోజున 22 విమానాల్లో 729 మంది ప్రయాణికులు ఎయిర్ పోర్టుకు చేరుకున్నాయని వివరించింది. కువైట్ వస్తున్న ప్రయాణికుల్లో ఎక్కువ మంది టర్కి, ఇండియన్లు ఉన్నారని తెలిపింది. కువైట్ పౌరులు కువైట్ మొసఫర్, డొమస్టిక్ వర్కర్లు బెల్ సలామ్ ద్వారా ముందస్తుగా రిజిస్టర్ చేసుకున్న తర్వాత దేశానికి చేరుకున్నారని వెల్లడించింది. అయితే..ఇతర దేశాల నుంచి కువైట్ చేరుకుంటున్న ప్రతి ఒక్కరికి పీసీఆర్ టెస్టులు నిర్వహించి క్వారంటైన్ తరలిస్తున్నామని తెలిపింది. క్వారంటైన్ కోసం పలు హోటల్స్ ని కేటాయించినట్లు కువైట్ వివరించింది.
తాజా వార్తలు
- నా పేరుతో వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లను నమ్మకండి:సీపీ సజ్జనార్
- భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు
- కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!
- గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!
- దుబాయ్ లో స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు..!!
- కొత్త పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా జెడ్డా సెంట్రల్..!!
- ప్రైవేట్ రంగంలో రిటైర్ ఎంప్లాయిస్ కు గుడ్ న్యూస్..!!
- రుస్తాక్లోని తావి అల్-హరా మార్కెట్లో వింటర్ క్రాప్..!!
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి







