రెండ్రోజుల్లో కువైట్ చేరుకున్న 1,442 మంది ప్రయాణికులు
- February 23, 2021
కువైట్ సిటీ:విమానాశ్రయం తిరిగి ప్రారంభమయ్యాక 48 గంటల్లోనే 1,442 మంది ప్రయాణికులు దేశానికి చేరుకున్నట్లు కువైట్ ప్రకటించింది. 48 గంటల్లో 48 విమానాలు కువైట్ విమానాశ్రయానికి చేరుకున్నాయని, దేశానికి చేరుకున్న 1,442 మంది ప్రయాణికుల్లో 989 పౌరులు, 453 మంది గృహ కార్మికులు ఉన్నారని వెల్లడించింది. విమాన సర్వీసులు ప్రారంభం అయిన తొలి రోజున 25 విమానాల్లో 713 మంది ప్రయాణికులు, రెండో రోజున 22 విమానాల్లో 729 మంది ప్రయాణికులు ఎయిర్ పోర్టుకు చేరుకున్నాయని వివరించింది. కువైట్ వస్తున్న ప్రయాణికుల్లో ఎక్కువ మంది టర్కి, ఇండియన్లు ఉన్నారని తెలిపింది. కువైట్ పౌరులు కువైట్ మొసఫర్, డొమస్టిక్ వర్కర్లు బెల్ సలామ్ ద్వారా ముందస్తుగా రిజిస్టర్ చేసుకున్న తర్వాత దేశానికి చేరుకున్నారని వెల్లడించింది. అయితే..ఇతర దేశాల నుంచి కువైట్ చేరుకుంటున్న ప్రతి ఒక్కరికి పీసీఆర్ టెస్టులు నిర్వహించి క్వారంటైన్ తరలిస్తున్నామని తెలిపింది. క్వారంటైన్ కోసం పలు హోటల్స్ ని కేటాయించినట్లు కువైట్ వివరించింది.
తాజా వార్తలు
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







