INTUC రాష్ట్ర నాయకుడు ఆర్.డి.చంద్రశేఖర్ ను కలిసిన గల్ఫ్ జెఏసి బృందం

- February 24, 2021 , by Maagulf
INTUC రాష్ట్ర నాయకుడు ఆర్.డి.చంద్రశేఖర్ ను కలిసిన గల్ఫ్ జెఏసి బృందం

తెలంగాణ:ఛలో ఢిల్లీ కార్యక్రమానికి మద్దతుకోసం..కేంద్ర కార్మిక సంఘాల నాయకులను కలిసిన గల్ఫ్ జెఏసి బృందం.

ఆరు గల్ఫ్ దేశాలకు కొత్తగా వెళ్ళే కార్మికులకు కనీస వేతనాలను (మినిమమ్ రిఫరల్ వేజెస్) తగ్గిస్తూ భారత ప్రభత్వం సెప్టెంబర్ 2020 లో జారీచేసిన రెండు సర్కులర్లను ఉపసంహరించుకోవాలి.పాత వేతనాలను కొనసాగించాలి.అనే డిమాండ్ తో తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (గల్ఫ్ జెఏసి) చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమానికి మద్దతు కోరుతూ పలు సంఘాల నేతలను కలిసేందుకు గల్ఫ్ జెఏసి బృందం బుధవారం (24.02.2021) హైదరాబాద్ లో పర్యటించింది. 

ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (INTUC) రాష్ట్ర నాయకుడు ఆర్.డి. చంద్రశేఖర్ ను గల్ఫ్ జెఏసి నాయకులు గుగ్గిల్ల రవిగౌడ్,తోట ధర్మేంద్ర కలిసి గల్ఫ్ కార్మికుల పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com