డాక్టర్పై దాడి గర్హనీయం: హెల్త్ మినిస్ట్రీ
- February 26, 2021
కువైట్ సిటీ :అల్ రజి హాస్పిటల్లో విధి నిర్వహణలో వున్న ఓ వైద్యుడిపై జరిగిన దాడిని హెల్త్ మినిస్ట్రీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి చర్యలు హేయమని మినిస్ట్రీ అభిప్రాయపడింది. కాగా, షువైక్ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు కేసు నమోదయ్యింది. ఓ వ్యక్తి, డాక్టరుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటనలో వైద్యుడి చెయ్యి విరిగినట్లుగా తెలుస్తోంది. కరోనాతో బాధపడుతున్న తన బంధువుని పరామర్శించేందుకు నిందితుడు ఆసుపత్రికి రాగా అతన్ని వైద్యుడు నిలువరించడమే ఈ ఘటనకు కారణం. మరోపక్క, వైద్యుల రక్షణ కోసం అన్ని చర్యలూ చేపడుతున్నామనీ, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని అథారిటీస్ పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..