డాక్టర్పై దాడి గర్హనీయం: హెల్త్ మినిస్ట్రీ
- February 26, 2021
కువైట్ సిటీ :అల్ రజి హాస్పిటల్లో విధి నిర్వహణలో వున్న ఓ వైద్యుడిపై జరిగిన దాడిని హెల్త్ మినిస్ట్రీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి చర్యలు హేయమని మినిస్ట్రీ అభిప్రాయపడింది. కాగా, షువైక్ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు కేసు నమోదయ్యింది. ఓ వ్యక్తి, డాక్టరుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటనలో వైద్యుడి చెయ్యి విరిగినట్లుగా తెలుస్తోంది. కరోనాతో బాధపడుతున్న తన బంధువుని పరామర్శించేందుకు నిందితుడు ఆసుపత్రికి రాగా అతన్ని వైద్యుడు నిలువరించడమే ఈ ఘటనకు కారణం. మరోపక్క, వైద్యుల రక్షణ కోసం అన్ని చర్యలూ చేపడుతున్నామనీ, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని అథారిటీస్ పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









