డాక్టర్పై దాడి గర్హనీయం: హెల్త్ మినిస్ట్రీ
- February 26, 2021
కువైట్ సిటీ :అల్ రజి హాస్పిటల్లో విధి నిర్వహణలో వున్న ఓ వైద్యుడిపై జరిగిన దాడిని హెల్త్ మినిస్ట్రీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి చర్యలు హేయమని మినిస్ట్రీ అభిప్రాయపడింది. కాగా, షువైక్ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు కేసు నమోదయ్యింది. ఓ వ్యక్తి, డాక్టరుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటనలో వైద్యుడి చెయ్యి విరిగినట్లుగా తెలుస్తోంది. కరోనాతో బాధపడుతున్న తన బంధువుని పరామర్శించేందుకు నిందితుడు ఆసుపత్రికి రాగా అతన్ని వైద్యుడు నిలువరించడమే ఈ ఘటనకు కారణం. మరోపక్క, వైద్యుల రక్షణ కోసం అన్ని చర్యలూ చేపడుతున్నామనీ, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని అథారిటీస్ పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







