అంతర్జాతీయ ప్రయాణికులకు ఉచితంగా పీసీఆర్ టెస్ట్
- February 26, 2021కేరళ: కేరళాలోని విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రయాణికులకు పీసీఆర్ టెస్టులను ఉచితంగా నిర్వహిస్తున్నట్లు కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఫిబ్రవరి 22 నుంచి రాష్ట్రంలోని విమానాశ్రయాల్లో చిన్న పిల్లలతో సహా అంతర్జాతీయ ప్రయాణికులు అందరికీ పీసీఆర్ టెస్టులు ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, కోల్ కతా, కొచ్చి, తిరువనంతపురంతో పాటు మొత్తం ఎనిమిది విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రయాణికులకు పీసీఆర్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఇందుకుగాను ఒక్కో ప్రయాణికుడికి అటు ఇటుగా రూ.2000 ఛార్జ్ చేస్తున్నారు. అయితే..విదేశాల నుంచి ఇంటికి వచ్చే ప్రవాస కేరళీయులకు పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి నిబంధనను మినహాయించాలని కేరళ ముస్లిం కల్చరల్ సెంటర్ కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణికులకు పీసీఆర్ టెస్టులను ఉచితంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..