సయ్యద్ అఫ్రీన్ ను సన్మానించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత...
- February 28, 2021
హైదరాబాద్: తెలంగాణ యూనివర్సిటీ ద్వారా అతిచిన్న వయస్సులో తెలుగు లో డాక్టరేట్ అందుకున్న కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన సయ్యద్ అఫ్రీన్ బేగం ను ఎమ్మెల్సీ కవిత సత్కరించారు. జ్ఞాపిక ను అందజేశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో కవిత ను అఫ్రీన్ మర్యాద పూర్వకంగా కలిశారు.తెలుగు భాషా సాహిత్యం రచనలపై పరిశోధనకు గాను ఇటీవల తెలంగాణ యూనివర్సిటీ ఆమెకు డాక్టరేట్ ప్రధానం చేసింది.ఒక ముస్లిం యువతి తెలుగు మీడియం చదవడమే కాకుండా కేవలం మూడేళ్ల లోనే పి హెచ్ డి పూర్తి చేయడం ఎంతో గర్వకారణ మని కవిత అభినందించారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీనాచారి, ఉపాధ్యక్షులు రాజీవ్ సాగర్, ప్రొఫెస్సర్ కనకయ్య పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!
- ఖతార్ లో గ్లోబర్ డొమెస్టిక్ మినిమం ట్యాక్స్ కు సవరణలు..!!
- ఐరన్మ్యాన్ వరల్డ్ ఛాంపియన్షిప్.. పాక్షిక ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఏపీ: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం
- ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమంటూ తారిఖ్ రహ్మాన్ ప్రకటన
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..









