సయ్యద్ అఫ్రీన్ ను సన్మానించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత...
- February 28, 2021
హైదరాబాద్: తెలంగాణ యూనివర్సిటీ ద్వారా అతిచిన్న వయస్సులో తెలుగు లో డాక్టరేట్ అందుకున్న కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన సయ్యద్ అఫ్రీన్ బేగం ను ఎమ్మెల్సీ కవిత సత్కరించారు. జ్ఞాపిక ను అందజేశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో కవిత ను అఫ్రీన్ మర్యాద పూర్వకంగా కలిశారు.తెలుగు భాషా సాహిత్యం రచనలపై పరిశోధనకు గాను ఇటీవల తెలంగాణ యూనివర్సిటీ ఆమెకు డాక్టరేట్ ప్రధానం చేసింది.ఒక ముస్లిం యువతి తెలుగు మీడియం చదవడమే కాకుండా కేవలం మూడేళ్ల లోనే పి హెచ్ డి పూర్తి చేయడం ఎంతో గర్వకారణ మని కవిత అభినందించారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీనాచారి, ఉపాధ్యక్షులు రాజీవ్ సాగర్, ప్రొఫెస్సర్ కనకయ్య పాల్గొన్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







