ఐపీఎల్ పై మంత్రి కేటీఆర్ స్పందన...
- February 28, 2021హైదరాబాద్:ఈఏడాది నిర్వహించే ఐపీఎల్ మ్యాచ్ల వేదికల జాబితాలో హైదరాబాద్ లేదని ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో ఈ విషయమై మంత్రి కేటీఆర్ స్పందించారు.ఈ సందర్భంగా కేటీఆర్ బీసీసీఐతో పాటు ఐపీఎల్కు ఓ ఆఫర్ ఇచ్చారు.
రాబోయే ఐపీఎల్ మ్యాచ్లను హైదరాబాద్లో నిర్వహించాలని కోరిన మంత్రి కేటీఆర్.. మ్యాచ్ల నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లతో పాటు పూర్తి మద్ధతును ఇస్తామని తెలిపారు. అంతేకాకుండా దేశంలోనే తక్కువ సంఖ్యలో కరోనా కేసులు హైదరాబాద్లో నమోదవుతున్నాయని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ల వేదికలో కోసం ఇప్పటికే ఐపీఎల్ నిర్వాహకులు చెన్నై, బెంగళూరు, దిల్లీలను, కోల్కతా, అహ్మదాబాద్లను మాత్రమే వేదికలుగా ఎంపిక చేశారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటే ముంబైని వేదికల జాబితాలో చేర్చాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి హైదరాబాద్లో ఐపీఎల్ క్రీడలపై నీలి మేఘాలు కమ్ముకున్నాను.ఈ క్రమంలోనే హైదరాబాద్లో ఐపీఎల్ నిర్వహించాలని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.మరి ఐపీఎల్ నిర్వాహన కమిటీ దీనికి అంగీకరిస్తుందో లేదో చూడాలి.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..