ఐపీఎల్ పై మంత్రి కేటీఆర్ స్పందన...
- February 28, 2021
హైదరాబాద్:ఈఏడాది నిర్వహించే ఐపీఎల్ మ్యాచ్ల వేదికల జాబితాలో హైదరాబాద్ లేదని ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో ఈ విషయమై మంత్రి కేటీఆర్ స్పందించారు.ఈ సందర్భంగా కేటీఆర్ బీసీసీఐతో పాటు ఐపీఎల్కు ఓ ఆఫర్ ఇచ్చారు.
రాబోయే ఐపీఎల్ మ్యాచ్లను హైదరాబాద్లో నిర్వహించాలని కోరిన మంత్రి కేటీఆర్.. మ్యాచ్ల నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లతో పాటు పూర్తి మద్ధతును ఇస్తామని తెలిపారు. అంతేకాకుండా దేశంలోనే తక్కువ సంఖ్యలో కరోనా కేసులు హైదరాబాద్లో నమోదవుతున్నాయని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ల వేదికలో కోసం ఇప్పటికే ఐపీఎల్ నిర్వాహకులు చెన్నై, బెంగళూరు, దిల్లీలను, కోల్కతా, అహ్మదాబాద్లను మాత్రమే వేదికలుగా ఎంపిక చేశారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటే ముంబైని వేదికల జాబితాలో చేర్చాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి హైదరాబాద్లో ఐపీఎల్ క్రీడలపై నీలి మేఘాలు కమ్ముకున్నాను.ఈ క్రమంలోనే హైదరాబాద్లో ఐపీఎల్ నిర్వహించాలని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.మరి ఐపీఎల్ నిర్వాహన కమిటీ దీనికి అంగీకరిస్తుందో లేదో చూడాలి.
తాజా వార్తలు
- ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!
- ఖతార్ లో గ్లోబర్ డొమెస్టిక్ మినిమం ట్యాక్స్ కు సవరణలు..!!
- ఐరన్మ్యాన్ వరల్డ్ ఛాంపియన్షిప్.. పాక్షిక ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఏపీ: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం
- ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమంటూ తారిఖ్ రహ్మాన్ ప్రకటన
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..









