ఐపీఎల్‌ పై మంత్రి కేటీఆర్‌ స్పందన...

- February 28, 2021 , by Maagulf
ఐపీఎల్‌ పై మంత్రి కేటీఆర్‌ స్పందన...

హైదరాబాద్:ఈఏడాది నిర్వహించే ఐపీఎల్‌ మ్యాచ్‌ల వేదికల జాబితాలో హైదరాబాద్‌ లేదని ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో ఈ విషయమై మంత్రి కేటీఆర్‌ స్పందించారు.ఈ సందర్భంగా కేటీఆర్‌ బీసీసీఐతో పాటు ఐపీఎల్‌కు ఓ ఆఫర్‌ ఇచ్చారు.

రాబోయే ఐపీఎల్‌ మ్యాచ్‌లను హైదరాబాద్‌లో నిర్వహించాలని కోరిన మంత్రి కేటీఆర్‌.. మ్యాచ్‌ల నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లతో పాటు పూర్తి మద్ధతును ఇస్తామని తెలిపారు. అంతేకాకుండా దేశంలోనే తక్కువ సంఖ్యలో కరోనా కేసులు హైదరాబాద్‌లో నమోదవుతున్నాయని కేటీఆర్‌ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్‌ మ్యాచ్‌ల వేదికలో కోసం ఇప్పటికే ఐపీఎల్‌ నిర్వాహకులు చెన్నై, బెంగళూరు, దిల్లీలను, కోల్‌కతా, అహ్మదాబాద్‌లను మాత్రమే వేదికలుగా ఎంపిక చేశారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటే ముంబైని వేదికల జాబితాలో చేర్చాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి హైదరాబాద్‌లో ఐపీఎల్‌ క్రీడలపై నీలి మేఘాలు కమ్ముకున్నాను.ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఐపీఎల్‌ నిర్వహించాలని కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.మరి ఐపీఎల్‌ నిర్వాహన కమిటీ దీనికి అంగీకరిస్తుందో లేదో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com