ఐపీఎల్ పై మంత్రి కేటీఆర్ స్పందన...
- February 28, 2021
హైదరాబాద్:ఈఏడాది నిర్వహించే ఐపీఎల్ మ్యాచ్ల వేదికల జాబితాలో హైదరాబాద్ లేదని ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో ఈ విషయమై మంత్రి కేటీఆర్ స్పందించారు.ఈ సందర్భంగా కేటీఆర్ బీసీసీఐతో పాటు ఐపీఎల్కు ఓ ఆఫర్ ఇచ్చారు.
రాబోయే ఐపీఎల్ మ్యాచ్లను హైదరాబాద్లో నిర్వహించాలని కోరిన మంత్రి కేటీఆర్.. మ్యాచ్ల నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లతో పాటు పూర్తి మద్ధతును ఇస్తామని తెలిపారు. అంతేకాకుండా దేశంలోనే తక్కువ సంఖ్యలో కరోనా కేసులు హైదరాబాద్లో నమోదవుతున్నాయని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ల వేదికలో కోసం ఇప్పటికే ఐపీఎల్ నిర్వాహకులు చెన్నై, బెంగళూరు, దిల్లీలను, కోల్కతా, అహ్మదాబాద్లను మాత్రమే వేదికలుగా ఎంపిక చేశారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటే ముంబైని వేదికల జాబితాలో చేర్చాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి హైదరాబాద్లో ఐపీఎల్ క్రీడలపై నీలి మేఘాలు కమ్ముకున్నాను.ఈ క్రమంలోనే హైదరాబాద్లో ఐపీఎల్ నిర్వహించాలని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.మరి ఐపీఎల్ నిర్వాహన కమిటీ దీనికి అంగీకరిస్తుందో లేదో చూడాలి.
తాజా వార్తలు
- నా పేరుతో వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లను నమ్మకండి:సీపీ సజ్జనార్
- భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు
- కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!
- గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!
- దుబాయ్ లో స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు..!!
- కొత్త పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా జెడ్డా సెంట్రల్..!!
- ప్రైవేట్ రంగంలో రిటైర్ ఎంప్లాయిస్ కు గుడ్ న్యూస్..!!
- రుస్తాక్లోని తావి అల్-హరా మార్కెట్లో వింటర్ క్రాప్..!!
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి







