బహ్రెయిన్:ఫుడ్ ట్రక్స్ లో తనిఖీలు..సెఫ్టీ ప్రమాణాల పరిశీలన
- February 28, 2021
మనామా:ఆహార పదార్ధాలను సరఫరా చేసే ఫుడ్ ట్రక్స్ లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఫిబ్రవరి 26న చేపట్టిన డ్రైవ్ లో భాగంగా... జఫైర్, బసైతీన్ లోని అల్ సాయలో ఎనిమిది ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు ఈ సోదాలో పాల్గొన్నారు. జుఫైర్ 19, అల్ సయలో 41 ఫుడ్ ట్రక్కుల్లో భద్రత ప్రమాణాలను పరిశీలించారు. మొత్తం 130 ఫుడ్ ట్రక్కులు ఉండగా ప్రస్తుతం 61 ట్రక్కుల్లో సోదాలు చేపట్టామని, మిగిలిన వాటిని మలి విడత డ్రైవ్ లో తనిఖీ చేస్తామన్నారు అధికారులు. తమ తనిఖీల్లో 11 ఫుడ్ ట్రక్కులు నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించామని, ఎనిమిది మంది ట్రక్కు ఓనర్లు బహ్రెయినీయులకు బదులుగా విదేశీయులను ఉద్యోగంలోకి తీసుకున్నారని, మరో మూడు ట్రక్కు డ్రైవర్లకు సరైన లైసెన్స్ లేవని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- కేంద్ర రోడ్డు నిధి కింద రోడ్డు మరమ్మత్తుల పై ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- పాన్ కార్డు నిబంధనల్లో మార్పులు..ఏప్రిల్ 1 నుంచి అమలు
- ఫిలడెల్ఫియాలో ఘనంగా NATS బాలల సంబరాలు
- నమీబియా పై భారత్ భారీ స్కోరు
- ప్రపంచంలోనే మొట్టమొదటి 24 గంటల స్టేడియం స్పోర్ట్స్ హాకథాన్కు ఆతిథ్యం వహించనున్న తెలంగాణ
- NTRకు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్
- దేశంలోనే తొలి మ్యూజిక్ రోడ్డు ప్రారంభం..
- నిమాయిష్ బహుమతుల ప్రదానోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు
- కొలకలూరి సాహిత్య పురస్కారాలు–2026 విజేతల ప్రకటన
- ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు









