బహ్రెయిన్:ఫుడ్ ట్రక్స్ లో తనిఖీలు..సెఫ్టీ ప్రమాణాల పరిశీలన
- February 28, 2021మనామా:ఆహార పదార్ధాలను సరఫరా చేసే ఫుడ్ ట్రక్స్ లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఫిబ్రవరి 26న చేపట్టిన డ్రైవ్ లో భాగంగా... జఫైర్, బసైతీన్ లోని అల్ సాయలో ఎనిమిది ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు ఈ సోదాలో పాల్గొన్నారు. జుఫైర్ 19, అల్ సయలో 41 ఫుడ్ ట్రక్కుల్లో భద్రత ప్రమాణాలను పరిశీలించారు. మొత్తం 130 ఫుడ్ ట్రక్కులు ఉండగా ప్రస్తుతం 61 ట్రక్కుల్లో సోదాలు చేపట్టామని, మిగిలిన వాటిని మలి విడత డ్రైవ్ లో తనిఖీ చేస్తామన్నారు అధికారులు. తమ తనిఖీల్లో 11 ఫుడ్ ట్రక్కులు నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించామని, ఎనిమిది మంది ట్రక్కు ఓనర్లు బహ్రెయినీయులకు బదులుగా విదేశీయులను ఉద్యోగంలోకి తీసుకున్నారని, మరో మూడు ట్రక్కు డ్రైవర్లకు సరైన లైసెన్స్ లేవని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల