రూ.220 కోట్ల నల్లధనం గుర్తింపు

- February 28, 2021 , by Maagulf
రూ.220 కోట్ల నల్లధనం గుర్తింపు

చెన్నై:చెన్నైలో ఒక ప్రముఖ టైల్స్‌, శానిటరీవేర్‌ తయారీ సంస్థపై ఆదాయపన్ను శాఖ నిర్వహించిన దాడుల్లో రూ.220 కోట్ల నల్లధనాన్ని గుర్తించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) ఒక ప్రకటనలో తెలిపింది.తమిళనాడుతోసహా గుజరాత్‌, కోల్‌కతాలోని 20 ప్రదేశాల్లో ఫిబ్రవరి 26న ఐటి దాడులు జరిపిందని, రూ.8.30 కోట్లు సీజ్‌ చేసిందని పేర్కొంది.గత ఏడాది టర్నోవర్‌తో పోలిస్తే రూ.120 కోట్లను సక్రమంగా గుర్తించినా, మరో రూ.100 కోట్లకు సరైన లెక్కలు లేవని తెలిపింది. ఎన్నికల్లో ప్రలోభ పెట్టడానికి ఈ నగదును పంపిణీ చేయనున్నారా అనే అంశంపైనే ఆదాయపన్ను శాఖ విచారణ చేయనుందని సిబిడిటి తెలిపింది.తమిళనాడు, పుదుచ్చేరిలో ఏప్రిల్‌ 6న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com