రూ.220 కోట్ల నల్లధనం గుర్తింపు
- February 28, 2021చెన్నై:చెన్నైలో ఒక ప్రముఖ టైల్స్, శానిటరీవేర్ తయారీ సంస్థపై ఆదాయపన్ను శాఖ నిర్వహించిన దాడుల్లో రూ.220 కోట్ల నల్లధనాన్ని గుర్తించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) ఒక ప్రకటనలో తెలిపింది.తమిళనాడుతోసహా గుజరాత్, కోల్కతాలోని 20 ప్రదేశాల్లో ఫిబ్రవరి 26న ఐటి దాడులు జరిపిందని, రూ.8.30 కోట్లు సీజ్ చేసిందని పేర్కొంది.గత ఏడాది టర్నోవర్తో పోలిస్తే రూ.120 కోట్లను సక్రమంగా గుర్తించినా, మరో రూ.100 కోట్లకు సరైన లెక్కలు లేవని తెలిపింది. ఎన్నికల్లో ప్రలోభ పెట్టడానికి ఈ నగదును పంపిణీ చేయనున్నారా అనే అంశంపైనే ఆదాయపన్ను శాఖ విచారణ చేయనుందని సిబిడిటి తెలిపింది.తమిళనాడు, పుదుచ్చేరిలో ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు