శ్రీవారి భక్తులకు అలర్ట్..
- July 09, 2026
తిరుమల: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ప్లాన్ చేసుకుంటున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అలర్ట్ జారీ చేసింది. రాబోయే జులై నుంచి సెప్టెంబర్ నెలల మధ్య తిరుమలలో జరిగే వివిధ పండుగలు, విశేష ఉత్సవాల నేపథ్యంలో.. పలు ప్రత్యేక తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల సాధారణ భక్తులకు దర్శన సమయం కలిసిరానుంది. ప్రొటోకాల్ పరిధిలోకి వచ్చే ప్రముఖులకు మినహా, మిగిలిన ఎవరి సిఫార్సు లేఖలనూ ఆయా తేదీలకు ముందురోజు స్వీకరించబోమని బోర్డు స్పష్టం చేసింది. భక్తులు ఈ మార్పులను గమనించి తమ తిరుమల యాత్రను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దయిన తేదీలు–కారణాలు:
- జులై 14: కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
- జులై 17: ఆణివార ఆస్థానం
- జులై 19: శ్రీ ఆండవన్ ఆశ్రమ స్వామీజీకి పెద్ద మర్యాద
- జులై 29: జీయర్ స్వాముల చాతుర్మాస సంకల్పం
- ఆగస్టు 22: పవిత్రోత్సవాలకు అంకురార్పణ
- ఆగస్టు 24: పవిత్రోత్సవాల రెండోరోజు (పవిత్రాల సమర్పణ)
- సెప్టెంబర్ 8: శ్రీవారి బ్రహ్మోత్సవాల కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
- సెప్టెంబర్ 14: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
- సెప్టెంబర్ 15 నుండి 23 వరకు: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
ఈ 9 రోజులు బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు అయ్యాయి. కాబట్టి, తిరుమల భక్తులు ఈ తేదీలను చూసుకొని వారివారి ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాల్సిందిగా టీటీడీ (TTD) సూచించింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







