తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- March 01, 2021
హైదరాబాద్:తెలంగాణలో ఇవాళ కరోనా కేసులు తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 116 పాజిటివ్ కేసులు నమోదవగా...ఎలాంటి మరణాలు సంభవించలేదు.ఇదే సమయంలో 165 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,98,923 కు చేరుకోగా.. 2,95,387 మంది రికవరీ అయ్యారు.. ఇక, ఇప్పటి వరకు 1,634 మంది మృతిచెందారు.దేశవ్యాప్తంగా కరోనా రికవరీ శాతం 97.1 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 98.81 శాతంగా ఉందని.. ప్రస్తుతం 1,902 యాక్టివ్ కేసులు ఉండగా.. అందులో 804 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారని బులెటిన్లో పేర్కొంది సర్కార్.నిన్న ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 20,375 శాంపిల్స్ టెస్ట్ చేశామని..ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్ల సంఖ్య 87,21,026 కు చేరిందని బులెటిన్లో పేర్కొన్నారు అధికారులు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







