కోవిడ్ టీకా తీసుకున్న ప్రధాని మోదీ
- March 01, 2021
న్యూ ఢిల్లీ:ప్రధాన నరేంద్ర మోదీ కోవిడ్ టీకా వేయించుకున్నారు. భారత్ బయోటెక్కు చెందిన కొవాగ్జిన్ టీకాను మోదీ తీసుకున్నారు. మోదీకి సిరంజీ ద్వారా ఎయిమ్స్ సిస్టర్ పి.నివేదా టీకా ఇచ్చారు. దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్లో భాగంగా 60 ఏళ్లు పైబడిన వారికి, 45 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న దీర్ఘకాల వ్యాధిగ్రస్థులకు ఇవాల్టి నుంచి టీకా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఎయిమ్స్లో ప్రధాని మోదీ తొలి డోసు టీకాను తీసుకున్నారు. తాను తొలి డోసు టీకా తీసుకున్నట్లు మోదీ ట్విటర్ ద్వారా ప్రకటించారు.
కొవిడ్కి వ్యతిరేకంగా మన దేశ వైద్యులు, శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు. అర్హులందరూ కోవిడ్ టీకా తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. మనమందరం కలిసి భారత్ను కొవిడ్ రహిత దేశంగా తీర్చిదిద్దుదామని ఆయన పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!







