కోవిడ్ ఎఫెక్ట్: భారత రాయబార కార్యాలయం మూసివేత
- March 02, 2021కువైట్ సిటీ:కోవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుండటంతో కువైట్లోని భారత రాయబార కార్యాలయం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి ఈ నెల 4 వరకు రాయబార కార్యాలయంలో ప్రత్యక్ష సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే..అత్యవసర సేవలను మాత్రం కొనసాగించనున్నారు. అత్యవసర సేవలు పొందేందుకు ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఎంబసీ నుంచి ఎవరైన ఎమర్జెన్సీ సేవలు పొందెందుకు [email protected] ద్వారా తమను సంప్రదించాలని అధికారులు వెల్లడించారు. పాస్ పోర్టు సేవలు మాత్రం యాధావిధిగా కొనసాగుతాయని.. ఇందుకోసం కువైట్లోని మూడు పాస్ పోర్టు కేంద్రాలను సంప్రదించవచ్చని తెలిపారు. ఇదిలాఉంటే మార్చి నెలకు సంబంధించి ఎంబసీ కార్యాలయం షెడ్యూల్ చేసిన అన్ని ఈవెంట్లను వాయిదా వేశామని కూడా అధికారులు వివరించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి, కువైట్)
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!