కోవిడ్ ఎఫెక్ట్: భారత రాయబార కార్యాలయం మూసివేత
- March 02, 2021
కువైట్ సిటీ:కోవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుండటంతో కువైట్లోని భారత రాయబార కార్యాలయం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి ఈ నెల 4 వరకు రాయబార కార్యాలయంలో ప్రత్యక్ష సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే..అత్యవసర సేవలను మాత్రం కొనసాగించనున్నారు. అత్యవసర సేవలు పొందేందుకు ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఎంబసీ నుంచి ఎవరైన ఎమర్జెన్సీ సేవలు పొందెందుకు [email protected] ద్వారా తమను సంప్రదించాలని అధికారులు వెల్లడించారు. పాస్ పోర్టు సేవలు మాత్రం యాధావిధిగా కొనసాగుతాయని.. ఇందుకోసం కువైట్లోని మూడు పాస్ పోర్టు కేంద్రాలను సంప్రదించవచ్చని తెలిపారు. ఇదిలాఉంటే మార్చి నెలకు సంబంధించి ఎంబసీ కార్యాలయం షెడ్యూల్ చేసిన అన్ని ఈవెంట్లను వాయిదా వేశామని కూడా అధికారులు వివరించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి, కువైట్)
తాజా వార్తలు
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!
- అత్యవసర వాహనాలను అడ్డుకుంటే.. 3నెలల జైలుశిక్ష..!!
- ఒమన్ రికార్డు..3.9 మిలియన్ల విజిట్స్..!!
- బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పొగమంచు..!!
- లోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మాణానికి కాంగ్రెస్ సిద్ధం
- మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం: డీజీపీ శివధర్ రెడ్డి
- విశాఖ మెట్రోకు గ్రీన్ సిగ్నల్
- టీటీడీకి రూ.30 లక్షలు విరాళం









